అన్వేషించండి

Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని

Secunderabad Muthyalamma Temple | సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో త్వరలో అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

BRS MLA Talasani Srinivas Yadav Latest News| హైదరాబాద్: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం (Muthyalamma Temple)లో త్వరలో అమ్మవారి నూతన విగ్రహం ప్రతిష్టించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో మంగళవారం నాడు సమావేశం అయ్యారు. అనంతరం కుమ్మరిగూడకు చెందిన పండితులతో కలిసి వెళ్లి బస్తీ వాసులతో ఎమ్మెల్యే తలసాని మాట్లాడారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

విగ్రహం ధ్వంసం బాధాకరం, ముమ్మాటికీ దుర్మార్గపు చర్య
తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఇది ముమ్మాటికీ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఇందుకు కారుకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ఏరియాలో అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిన నాటి నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తలసాని విచారం వ్యక్తం చేశారు. తనకు ఊహ తెలిసిన తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదన్నారు. ఈ పరిస్థితులకు ముగింపు పలకాలని, ప్రశాంత వాతావరణంలో ఇక్కడి ప్రజలు జీవించేలా చేయడం తమ ఉద్దేశమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని

అమ్మవారి విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేయడంతో కొన్ని రోజులుగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి కోలుకుంటున్నా.. తమకు మళ్లీ అమ్మవారు కావాలని, విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పండితుల సూచనలు, సలహాల మేరకు నూతన అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బస్తీవాసుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని విగ్రహ ప్రతిష్టతో పాటు కుంభాభిషేకం, 3 రోజుల పాటు శాంతి పూజలు, హోమాలను నిర్వహించనున్నారు.

Also Read: KTR On Konda Surekha : వ్యక్తిగత దాడులను సహించను - లక్ష్మణ రేఖ గీస్తా - మరోసారి కేటీఆర్ హెచ్చరిక

బోనాలు సమర్పించనున్న బస్తీ వాసులు
ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని  బస్తీ వాసులు ఎమ్మెల్యే తలసానికి తెలిపారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలకు అవకాశం లేకుండా పూజా కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అమ్మవారి విగ్రహం ప్రతిష్ట, పూజల తేదీలను నిర్ణయించి ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ సభ్యులు కిరణ్, కిషోర్, మహేష్, ఎల్లేష్, సాయి, మోండా మార్కెట్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, BRS పార్టీ డివిజన్ అద్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని, నాగులు, రాములు, మహేష్ యాదవ్, సత్యనారాయణ, జయరాజ్,  బస్తీ వాసులు మురళి, రవి, సునీత, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్,  వెంకటేషన్ రాజు, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీహరి తదితరులు ఉన్నారు.

Also Read: Jagtial News: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget