అన్వేషించండి

KTR: నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్, ఇక ఉప్పల్-ఎల్బీనగర్ మధ్య సిగ్నల్ ఫ్రీ

వంతెన ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాగోల్ ఫ్లై ఓవర్‌కు మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు చేశారని కేటీఆర్‌ చెప్పారు.

ఎల్బీ నగర్ - సికింద్రాబాద్ మార్గంలో నాగోల్ వద్ద కీలక ఫ్లై ఓవర్ ను పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిత్యం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో దీన్ని నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకూ ఎలాంటి సిగ్నళ్లు లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చు. వంతెన ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాగోల్ ఫ్లై ఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, ల్యాండ్ అక్విజిషన్, ప్రాజెక్ట్‌తో కలిపి మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు చేశారని కేటీఆర్‌ చెప్పారు. ఇది 990 మీటర్ల పొడవుతో 6 లేన్లతో నిర్మించారని మంత్రి అన్నారు. ఈ ఫ్లై ఓవర్‌తో ఉప్పల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుందని అన్నారు.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా హైదరాబాద్‌లో మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యంగా నగరంలో చాలా ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ కింద మొత్తం 47 ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయని అన్నారు. మరో 16 ఫ్లై ఓవర్ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పూర్తయిన 31 పనుల్లో 15 ఫ్లై ఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ చెప్పారు. 

ఈ నాగోల్ ఫ్లైఓవర్ వరుసగా 16వ ఫ్లై ఓవర్ అని అన్నారు. చాలా మంది ప్రజలు ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగానే రాకపోకలు సాగిస్తూ ఉంటారని, కీలకమైన ఈ మార్గంలో ఫ్లై ఓవర్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు. హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ల పరంపర ఇక్కడితో ఆగబోదని మంత్రి చెప్పారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి త్వరలో మరో రెండు ఫ్లై ఓవర్లు రానున్నాయని తెలిపారు. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్ కాగా మరొకటి శిల్పా లే అవుట్ బ్రిడ్జి అని అన్నారు. ఈ రెండింటి పనులు పూర్తవుతున్నాయని, వీటిని కూడా డిసెంబర్‌ నాటికి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు.

47 ప్రాజెక్టుల్లో పూర్తయినవి ఇవీ..

ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా గ్రేటర్‌లో 47 ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఇందులో హెచ్‌ఎండీఏ, ఆర్‌ అండ్‌ బీ ఆరు ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టగా.. మరో 41 పనులు జీహెచ్‌ఎంసీ చేస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నాగోల్‌ వంతెన అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య 32కు చేరనుంది. ఇందులో 15 వంతెనలు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, ఐదు అండర్‌ పాస్‌లు, తొమ్మిది ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు ఉన్నాయి. మరో 16 ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. శిల్ప లే అవుట్‌, డిసెంబర్‌నాటికి బొటానికల్‌ గార్డెన్‌ వంతెనలు అందుబాటులోకి వస్తే.. కూకట్‌పల్లి, మాదాపూర్‌, తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సులువు కానున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget