అన్వేషించండి

హైదరాబాద్ మెట్రో సిబ్బంది మెరుపు సమ్మె- సీరియస్‌గా తీసుకున్న యాజమాన్యం!

హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. టికెటింగ్ స్టాప్‌ సమ్మెతో ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు గందరగోళం నెలకొంది.

హైదరాబాద్‌లోని మెట్రోలో టికెటింగ్‌ స్టాఫ్‌ మెరుపు సమ్మెకు దిగారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ మార్గంలో ఉన్న మెట్రో సిబ్బంది ఆందోళన బాటపట్టారు. మొత్తం 27 స్టేషన్‌లలోని టికెట్‌ కౌంటర్‌లలో పని చేస్తున్న సిబ్బంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు. 

తమ సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిబ్బంది ఆరోపించారు. తమ జీతాలు పెంచలేదని వాపోయారు. రిలీవర్‌లు సరైన టైంకు రాకపోవడంతో ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోందని ఆరోపించారు. కనీసం సమయానికి తినడానికి కూడా అవకాశం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 

సుమారు గంటపాటు ఈ ఆందోళన కొనసాగింది. చివరకు కాంట్రాంక్ట్ ఏజెన్సీ కియోలిస్‌ అధికారులు స్పందించారు. సిబ్బందితో మాట్లాడి వాళ్ల సమస్యలు పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. 

ఈ ఆందోళనలపై మెట్రో యాజమాన్యం స్పందించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌ను ఆదేశించింది. వారి ఆవేదన ఉద్దేశం సహేతుకమే అయినా... వారు చేసిన పని మాత్రం కరెక్టు కాదన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం  తప్పుడు సమాచారాన్ని, పుకార్లను సృష్టించి వ్యాపిస్తున్నారని హెచ్‌ర్‌ మండిపడింది. వారి వాదనలు తప్పు అని కొట్టిపారేసింది. వారి చర్యలు ప్రజాప్రయోజనాలకు పూర్తి విరుద్ధమైనవని స్పష్టం చేసింది. వారిపై కఠిన చర్యలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు పేర్కొంది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలను మేనేజ్‌మెంట్‌ అందిస్తుందని వివరించింది. ఇంకా వాళ్లకు ఏం కావాలో తెలుసుకునేందుకు తగిన చర్చలు జరుపనుందని ప్రకటించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Anganwadi notification: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Embed widget