అన్వేషించండి

అందరి మద్దతుతో పోటీ చేస్తున్నా గెలిపించండి- కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున్ ఖర్గే వినతి

Mallikharjun Kharge: అందరి మద్దతుతోనే ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, అందరూ తనను ఆదరించాలని మల్లికార్జున్ ఖర్గే కోరారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాని అందరిని కలుస్తున్నట్టు తెలిపారు.

Mallikharjun Kharge: దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తోందని ఏఐసీసీ అధ్యక్ష పదవి అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అందరి మద్దతుతో పోటీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో భాగంగానే అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అహ్మదాబాద్, ముంబై వెళ్ళినట్లు మల్లికార్జన్ ఖర్గే పేర్కొన్నారు. 

ఈనెల 17వ తేదీన ఎన్నికలు.. మద్దతివ్వండి!

కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిలో చాలా మంది నేతలు పని చేశారని.. గాంధీ కుటుంబమే కాకుండా ఇతర నాయకులు కూడా ప్రెసిడెంట్ అయ్యారని మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పదవిలో ఉన్నారని.. తాను కూడా అదే బాటులో నడుస్తానని వివరించారు. ఈనెల 17వ తేదీన ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయని... దేశ వ్యాప్తంగా 9వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతా తనుకు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

మోదీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ నడిపిస్తుందని ఆరోపించారు ఖర్గే. ప్రధాని మోడీ దేశ సంపదను ఆగం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగిపోయిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తోపాటు పిల్లల వాడే పెన్సిల్ ధరలను కూడా విపరీతంగా పెంచారన్నారు. 

ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా మారిన ఏం ఉపయోగం లేదు..

ఇప్పటి వరకు మోడీ నియంత పాలనపై సోనియా గాంధీ పోరాటం చేశారని.. తాను కూడా అదే పంథాలో పోరాటం చేస్తానని మల్లికార్జున్ ఖర్గే వివరించారు. తనకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా పార్టీలు ఉన్నాయన్న ఆయన... అందులో కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. అయితే వాటితో ఎలాంటి లాభం లేదని చెప్పారు. టీఎంసీ.. ఏఐటీఎంసీ, ఏడీఎంకే, ఏఐడీఎంకేగా మారాయి కానీ బయట ఒక్కసీటు కూడా గెలవలేదని విమర్శించారు. టీఆరెస్ బిఆర్ఎస్ గా మారినా అదే పరిస్థితి ఎదురవుతుందని జోస్యం చెప్పారు. 

బీజేపీ అధ్యక్ష పదవికి ఎప్పుడైనా ఎన్నికలు పెట్టారా..?

బీజేపీ ప్రెసిడెంట్లు ఎలా ఎన్నికవుతున్నారని.. ఇప్పటి వరకు అధ్యక్షులుగా సాగిన జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్‌సింగ్ ఎలా అధ్యక్ష పదవిలోకి వచ్చారో చెప్పాలన్నారు. వారేమైనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా అంటూ ప్రశ్నించారు. ఈ ఉదయమే ఆయన హైదరాబాద్ వచ్చారు. బేగంపేట విమానానశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున స్వాగనం పలికారు. అనంతరం ఆయనను గాంధీ భవన్ కు తీసుకెళ్లారు. అక్కడే నేతలతో సమావేశమైన ఖర్గే తనను గెలిపించాలని కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget