అన్వేషించండి

Kavitha Letter:  బీఆర్‌ఎస్‌ కేడర్‌ అభిప్రాయం ముందే చెప్పిన ఏబీపీ దేశం- ఆ స్టోరీలోని అంశాలే లేఖలో పేర్కొన్న కవిత

Kavitha Letter: ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన రాజకీయ లేఖ ఇప్పుడు ప్రకంపనంసృష్టిస్తోంది. ఏబీపీ దేశం స్టోరీలోని అంశాలనే ఆమె ఎక్కువగా ప్రస్తావించారు.

BRS MLC Kavitha: మై డియర్ డాడీ అంటూ  ఎమ్మెల్సీ కవిత , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన రాజకీయ లేఖ ఇప్పుడు ప్రకంపనంసృష్టిస్తోంది. అయితే ఇందులో రాసిన అంశాలు చాలా వరకు మార్చి 21వ తేదీన  ఏబీపీ దేశం ( బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? నోరు మెదపని గులాబీ బాస్, అయోమయంలో పార్టీ క్యాడర్) అన్న శీర్షిక ప్రత్యేక కథనాన్ని వెబ్ సైట్లో ప్రచురించింది.

పార్టీలో ఏం జరుగుతుందన్న కోణంలో  గ్రౌండ్ రిపోర్ట్ గా ఈ కథనం ఇవ్వడం జరిగింది. అందులో పార్టీ క్యాడర్, నేతల్లో ఉన్న ఆలోచనలను వివరించడం జరిగింది. కేసీఆర్ మౌనంతో పార్టీలో కొంత అయోమయం నెలకొందని, బీజేపీ విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నామని, ఇది పార్టీకి  భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టిస్తుందని వివరించడం జరిగింది. అంతే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోడం సరి కాదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో, కార్యకర్తల్లో ఉందన్న విషయాన్ని ఈ కథనంలో చెప్పడం జరిగింది.

కాంగ్రెస్ టార్గెట్ గా రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంటే, ప్రభుత్వ వ్యతిరేకత గులాబీ పార్టీకి కాకుండా కమలం పార్టీకి కలిసి వస్తోందని, క్రమ క్రమంగా కమలం బలపడుతోందని ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించిందన్న ఉదాహరణలతో వివరించడం జరిగింది. ఈ కథనం పార్టీ ప్లీనరీకి ముందు రాయడం వల్ల, ఆ ప్లీనరీ ద్వారా పార్టీకి క్యాడర్‌కు స్పష్టమైన సంకేతం ఇస్తారా ఇవ్వారా అని ప్రశ్నిస్తూ స్టోరీ రాయడం జరిగింది. తమకు శత్రువు కాంగ్రెస్‌నా లేక బీజేపీ కూడానా, లేక బీజేపీతో కలిసి నడుస్తామా, ఇప్పుడు బీజేపీని కట్టడి చేయకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జోరు తగ్గుతుందని ఏబీపీ దేశం కథనం పేర్కొంది. 

 కవిత లేఖలో ఏం ఉంది.. ఏబీపీ కథనంలో ఏం ఉంది.. చూద్దామా ?

 మైడియర్ డాడీ అంటూ కవిత తన లేఖను రాశారు. మే 2వ తేదీన. అంటే  ఏబీపీ దేశం ఏప్రిల్ 27న జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల ముందు రాస్తూ, వరంగల్ బహిరంగ సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు ఏం స్పష్టత ఇవ్వనున్నారు అన్న కోణంలో రాయడం జరిగింది. పార్టీ ప్లీనరీ తర్వాత కవిత  లేఖ రాశారు.

ఏబీపీ దేశం ఏం రాసింది.. కవిత లేఖలో ఏం ఉందో  తెలుసుకుందాం.

1. కవిత రాసిన లేఖలో 8వ పాయింట్‌లో ఏబీపీ కథనంలో పేర్కొన్నట్లు బీజేపీ విషయంలో గట్టిగా మాట్లాడాల్సి ఉంది డాడీ  అని  పేర్కొనడం గమనార్హం. ప్లీనరీ వేదికగా రెండు నిముషాలు మాత్రమే బీజేపీని విమర్శించారు. దీని వల్ల బీజేపీతో పొత్తు భవిష్యత్తులో పెట్టుకోవచ్చు అన్న  ఊహాగానాలు కార్యకర్తలు, ప్రజల్లో నెలకొందని కవిత తన లేఖలో వివరించడం విశేషం. తనను లిక్కర్ కేసులో బీజేపీ ఇబ్బంది పెట్టిన కారణాన్ని ఆ లేఖలో  కవిత తన తండ్రికి గుర్తు చేశారు.

2. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, అయితే  అది బీజేపికి  ఉపయోగపడి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా రూపుదిద్దుకుంటుందన్న ఆందోళనలో క్యాడర్ ఉందని తన లేఖలో కవిత , కేసీఆర్ కు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఏబీపీ దేశం తన కథనంలో రాసింది. కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకత ఉందని, అయితే ఆ వ్యతిరేక పవానాలను బీఆర్ఎస్ క్యాష్ చేసుకోలేకపోవడం వల్ల అది బీజేపీకి లాభం చేకూర్చుతోందని, అందుకు  ఎమ్మెల్యే ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపే ఉదాహరణ అని చెప్పడం జరిగింది.

3. ఇక ఈ అంశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్ల బీజేపీకి సాయం చేస్తున్నామన్న సందేశం పార్టీలోకి బలంగా వెళ్లిందని కవిత తన లేఖలో పేర్కొంది. ఏబీపీ దేశం కథనంలోను ఇదే అంశాలను ప్రస్తావించింది.

గులాబీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి ఏబీపీ దేశం కథనం రాసింది. గ్రౌండ్ లెవల్ లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి కథనం పబ్లిష్ చేసింది. అవే అంశాలు కవిత తన లేఖలో రాయడం విశేషం.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
Andhra Statues Removal: ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
Andhra Pradesh TET 2025: నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
Weather Update: వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
Advertisement

వీడియోలు

Chiranjeevi Counter to Balakrishna | అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ | ABP Desam
Bathukammakunta Encroachments | ఇప్పటికీ కబ్జా కోరల్లోనే బతుకమ్మకుంట చెరువు..కోర్టులో పరిధిలో వివాదం
Hydra Effect Bathukammakunta : హైదరాబాద్ లో ఇలాంటి చెరువు మరెక్కడా లేదు.! భక్తి, ఆరోగ్యం, ఆనందం| ABP
Ind vs Ban Asia Fup 2025 Highlights | బంగ్లాదేశ్ ని చిత్తుగా ఓడించిన భారత్ | ABP Desam
OGతో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే కానీ.. ఒక్కటి తగ్గింది సుజీత్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
Andhra Statues Removal: ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
Andhra Pradesh TET 2025: నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
Weather Update: వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
YS Jagan Opposition Status: ప్రజలు ఇవ్వలేదు ఏం చేసినా ప్రయోజనం లేదు! -జగన్ ప్రతిపక్షహోదాపై అయ్యన్న కామెంట్స్ 
ప్రజలు ఇవ్వలేదు ఏం చేసినా ప్రయోజనం లేదు! -జగన్ ప్రతిపక్షహోదాపై అయ్యన్న కామెంట్స్ 
Fake Baba: శారదాపీఠం పేరుతో విద్యార్థులపై లైంగిక వేధింపులు - ఇతను కీచకబాబా
శారదాపీఠం పేరుతో విద్యార్థులపై లైంగిక వేధింపులు - ఇతను కీచకబాబా
Snake Beggig: మెడలో పాము వేసుకొచ్చి బెగ్గింగ్ -ఇవ్వక చస్తారా అన్నట్లుగా బెదిరింపులు- క్లైమాక్స్ ట్విస్ట్
మెడలో పాము వేసుకొచ్చి బెగ్గింగ్ -ఇవ్వక చస్తారా అన్నట్లుగా బెదిరింపులు- క్లైమాక్స్ ట్విస్ట్
OGతో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే కానీ.. ఒక్కటి తగ్గింది సుజీత్!
OGతో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే కానీ.. ఒక్కటి తగ్గింది సుజీత్!
Embed widget