అన్వేషించండి

Kavitha Letter:  బీఆర్‌ఎస్‌ కేడర్‌ అభిప్రాయం ముందే చెప్పిన ఏబీపీ దేశం- ఆ స్టోరీలోని అంశాలే లేఖలో పేర్కొన్న కవిత

Kavitha Letter: ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన రాజకీయ లేఖ ఇప్పుడు ప్రకంపనంసృష్టిస్తోంది. ఏబీపీ దేశం స్టోరీలోని అంశాలనే ఆమె ఎక్కువగా ప్రస్తావించారు.

BRS MLC Kavitha: మై డియర్ డాడీ అంటూ  ఎమ్మెల్సీ కవిత , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన రాజకీయ లేఖ ఇప్పుడు ప్రకంపనంసృష్టిస్తోంది. అయితే ఇందులో రాసిన అంశాలు చాలా వరకు మార్చి 21వ తేదీన  ఏబీపీ దేశం ( బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? నోరు మెదపని గులాబీ బాస్, అయోమయంలో పార్టీ క్యాడర్) అన్న శీర్షిక ప్రత్యేక కథనాన్ని వెబ్ సైట్లో ప్రచురించింది.

పార్టీలో ఏం జరుగుతుందన్న కోణంలో  గ్రౌండ్ రిపోర్ట్ గా ఈ కథనం ఇవ్వడం జరిగింది. అందులో పార్టీ క్యాడర్, నేతల్లో ఉన్న ఆలోచనలను వివరించడం జరిగింది. కేసీఆర్ మౌనంతో పార్టీలో కొంత అయోమయం నెలకొందని, బీజేపీ విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నామని, ఇది పార్టీకి  భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టిస్తుందని వివరించడం జరిగింది. అంతే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోడం సరి కాదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో, కార్యకర్తల్లో ఉందన్న విషయాన్ని ఈ కథనంలో చెప్పడం జరిగింది.

కాంగ్రెస్ టార్గెట్ గా రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంటే, ప్రభుత్వ వ్యతిరేకత గులాబీ పార్టీకి కాకుండా కమలం పార్టీకి కలిసి వస్తోందని, క్రమ క్రమంగా కమలం బలపడుతోందని ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించిందన్న ఉదాహరణలతో వివరించడం జరిగింది. ఈ కథనం పార్టీ ప్లీనరీకి ముందు రాయడం వల్ల, ఆ ప్లీనరీ ద్వారా పార్టీకి క్యాడర్‌కు స్పష్టమైన సంకేతం ఇస్తారా ఇవ్వారా అని ప్రశ్నిస్తూ స్టోరీ రాయడం జరిగింది. తమకు శత్రువు కాంగ్రెస్‌నా లేక బీజేపీ కూడానా, లేక బీజేపీతో కలిసి నడుస్తామా, ఇప్పుడు బీజేపీని కట్టడి చేయకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జోరు తగ్గుతుందని ఏబీపీ దేశం కథనం పేర్కొంది. 

 కవిత లేఖలో ఏం ఉంది.. ఏబీపీ కథనంలో ఏం ఉంది.. చూద్దామా ?

 మైడియర్ డాడీ అంటూ కవిత తన లేఖను రాశారు. మే 2వ తేదీన. అంటే  ఏబీపీ దేశం ఏప్రిల్ 27న జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల ముందు రాస్తూ, వరంగల్ బహిరంగ సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు ఏం స్పష్టత ఇవ్వనున్నారు అన్న కోణంలో రాయడం జరిగింది. పార్టీ ప్లీనరీ తర్వాత కవిత  లేఖ రాశారు.

ఏబీపీ దేశం ఏం రాసింది.. కవిత లేఖలో ఏం ఉందో  తెలుసుకుందాం.

1. కవిత రాసిన లేఖలో 8వ పాయింట్‌లో ఏబీపీ కథనంలో పేర్కొన్నట్లు బీజేపీ విషయంలో గట్టిగా మాట్లాడాల్సి ఉంది డాడీ  అని  పేర్కొనడం గమనార్హం. ప్లీనరీ వేదికగా రెండు నిముషాలు మాత్రమే బీజేపీని విమర్శించారు. దీని వల్ల బీజేపీతో పొత్తు భవిష్యత్తులో పెట్టుకోవచ్చు అన్న  ఊహాగానాలు కార్యకర్తలు, ప్రజల్లో నెలకొందని కవిత తన లేఖలో వివరించడం విశేషం. తనను లిక్కర్ కేసులో బీజేపీ ఇబ్బంది పెట్టిన కారణాన్ని ఆ లేఖలో  కవిత తన తండ్రికి గుర్తు చేశారు.

2. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, అయితే  అది బీజేపికి  ఉపయోగపడి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా రూపుదిద్దుకుంటుందన్న ఆందోళనలో క్యాడర్ ఉందని తన లేఖలో కవిత , కేసీఆర్ కు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఏబీపీ దేశం తన కథనంలో రాసింది. కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకత ఉందని, అయితే ఆ వ్యతిరేక పవానాలను బీఆర్ఎస్ క్యాష్ చేసుకోలేకపోవడం వల్ల అది బీజేపీకి లాభం చేకూర్చుతోందని, అందుకు  ఎమ్మెల్యే ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపే ఉదాహరణ అని చెప్పడం జరిగింది.

3. ఇక ఈ అంశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్ల బీజేపీకి సాయం చేస్తున్నామన్న సందేశం పార్టీలోకి బలంగా వెళ్లిందని కవిత తన లేఖలో పేర్కొంది. ఏబీపీ దేశం కథనంలోను ఇదే అంశాలను ప్రస్తావించింది.

గులాబీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి ఏబీపీ దేశం కథనం రాసింది. గ్రౌండ్ లెవల్ లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి కథనం పబ్లిష్ చేసింది. అవే అంశాలు కవిత తన లేఖలో రాయడం విశేషం.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget