అన్వేషించండి

YS Jagan Opposition Status: ప్రజలు ఇవ్వలేదు ఏం చేసినా ప్రయోజనం లేదు! -జగన్ ప్రతిపక్షహోదాపై అయ్యన్న కామెంట్స్ 

YS Jagan Opposition Status: ప్రజలు ఇవ్వని హోదాను రూల్స్‌కు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తాను ఇవ్వలేనని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Jagan Opposition Status: వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష హోదాపై ఇవ్వడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన చేతిలో లేనిదాని గురించి ఎక్కడకు వెళ్లినా యూజ్ లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో దేవుళ్లు లాంటి ప్రజలే ఇవ్వలేని హోదాను పూజారి లాంటి తాను ఎలా ఇవ్వగలనని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఎవరిపైనానా పోరాటాలు చేయొచ్చని అన్నారు. కానీ రూల్స్ అతిక్రమించి ఎవరూ ఏ పని చేయలేరని స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర అవుతోంది. మొదటి రోజు నుంచి చర్చనీయాంశమవుతున్న ప్రతిపక్ష హోదా వివాదం ఇంకా కొనసాగుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ మహోన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా మొండికేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే ప్రతిపక్ష హోదా కావాలని ఆయన పట్టుబడుతున్నారు. లేకుంటే సాధారణ ఎమ్మెల్యేగా సభకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నా, సమస్యలపై మాట్లాడాలి అన్నా ఆ హోదాలో ఉన్న వ్యక్తికి ఎక్కువ సమయం ఇస్తారని అందుకే ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్నామని డిమాండ్ చేస్తున్నారు. అలా లేని పక్షంలో వాయిస్ గట్టిగా వినిపించ లేమంటూ చెప్పుకొచ్చారు. 

దీనికి కౌంటర్ అధికార పార్టీ నుంచి ఘాటు విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీకి రాకుండా సమయం ఇవ్వడం లేదనే ఆరోపణలు సరికాదని అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఉన్న అతి పెద్ద వేదికను వదిలేసే తనకు బాకా ఊదే మీడియాను ముందు పెట్టుకొని చేసే విమర్శలు సరికాదని అంటున్నారు. ప్రజలకు, తనను ఎమ్మెల్యే ఎన్నుకున్న పులివెందుల ఓటర్లకు న్యాయం చేయాలంటే ఆయన సభకు రావాలని సూచిస్తున్నారు. కనీసం ఆయన ఎమ్మెల్యేలను కూడా సభకు పంపించడం లేదని మండిపడుతున్నారు. 

ఈ చర్చోపచర్చల వేళ ఈ వివాదంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్. దీనిపై స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం చెప్పాలని సూచించింది. ఈ విచారణ సాగుతుండగానే జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడి నుంచి కూడా స్పీకర్‌కు నోటీసులు వచ్చాయి. సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇలా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న జగన్ తీరుపై అయ్యన్న పాత్రుడు ఈ మధ్య ఓ రూలింగ్ ఇచ్చారు. సభకు రాకుండా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చినట్టు సంతకాలు పెట్టి వెళ్తున్నారని వారి సంగతి చూడాలని ప్రివిలేజ్‌ కమిటీకి సిఫార్సు చేశారు. దీనిపై విచారణ సాగుతున్న వేళ జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
ప్రతిపక్ష హోదాపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు జగన్ వెళ్లడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని అన్నారు. అలాంటి ప్రజలే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని ఈ పరిస్థితుల్లో తాను ఏం చేయలేనని చెప్పుకొచ్చారు. రూల్స్‌ను గత సంప్రదాయాలను అనుసరించే తాను ఏదైనా నిర్ణయం తీసుకోగలనని అన్నారు.

ప్రజలు ఇవ్వని హోదాను రూల్స్‌కు వ్యతిరేకంగా ఇవ్వాలని కోర్టులకు వెళ్లినా ఎక్కడకు వెళ్లినా తాను చేసేదేమీ లేదన్నారు అయ్యన్న. ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సభకు వచ్చి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. సమస్యలు చర్చించడానికి సభ మంచి వేదికని ఇక్కడ అందరూ ఉంటారని ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని మండిపడ్డారు. ఆయన రాకపోవడంతోపాటు ఎమ్మెల్యేలను కూడా పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికీ మించి ప్రజలు ఇవ్వని హోదా కోసం పోరాటం చేయడం ఏంటని ఎద్దేవా చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget