By: ABP Desam | Updated at : 23 Jul 2022 12:08 PM (IST)
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అగ్ని ప్రమాదం
మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశిష్ట ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. ఇది గమనించిన సిబ్బంది పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని విశిష్ట ల్యాబ్ లో ఉన్న రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రియాక్టర్స్ వద్ద జరిపే కెమికల్స్ చర్యలో భాగంగా వర్షాలకి చిన్న మెరుపు లాంటిది వచ్చి, అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది, స్థానికులు పోలీసులు, అగ్నిమాపక శాఖకు అగ్ని ప్రమాదంపై సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజన్స్ తో పాటు, ఒక డిజాస్టర్ వెహికల్, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ సహయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ రియాక్టర్ పేలుడుతో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
Vijaya Shanthi: కేసీఆర్ చెప్పేవన్నీ తుపాకి రాముడి కథలే, సీఎం వ్యాఖ్యలపై విజయ శాంతి కౌంటర్
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్న్యూస్, తెలంగాణ సర్కార్కు షాక్ - కీలక తీర్పు
Telangana Secretariat: కొత్త సెక్రెటేరియట్ వద్దకు సీఎం కేసీఆర్, భవనం మొత్తం పరిశీలన - కీలక ఆదేశాలు
Haritha Haram 2022: 21న తెలంగాణ అంతా హరితహారం, సీఎం కీలక ఆదేశాలు - మంత్రి వెల్లడి
వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా
AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?