అన్వేషించండి

Hydra Ranganath: మూసీ నది సుందరీకరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన, కూల్చివేతలపై క్లారిటీ

Hydra Commissioner AV Ranganath | మూసీ నది సుందరీకరణలో భాగంగా హైడ్రా ఎవరి ఇండ్లను కూల్చడం లేదని, ఏ ఇంటిని తాము మార్క్ చేయలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

Hydra Commissioner AV Ranganath | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణ పనులు చేపట్టడంలో భాగంగా, పరివాహక ప్రాంతాల వారిని వేరే చోటుకు తరలించాలని నిర్ణయించింది. మూసీ నిర్వాసితుల ఇళ్లను గుర్తించి, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం భావిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు పేరుతో అమాయకుల ఇళ్లను కూల్చివేసి, వారిని రోడ్డుమీదకు లాగుతుందన్న విమర్శలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మూసీ నది పరిధిలో తాము ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 

మూసీ ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి మార్కింగ్ చేయడం లేదు

మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మూసీ నదిలో ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదని రంగనాథ్ తెలిపారు. మూసీ నది పరివాహక నివాసితులను హైడ్రా అధికారులు ఎక్కడికి తరలించడం లేదని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.  మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని పేర్కొన్న ఆయన.. మూసీ నది ప్రక్షాళనను మూసీ రివర్ంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (Musi River Development Corporation) చేపడుతోందని వివరించారు.

Also Read: KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్ 

జలాశయాల పరిరక్షణే హైడ్రా టార్గెట్

కూల్చివేతలు అనేది హైడ్రా లక్ష్యం కాదని, చెరువులు, నాలాలు, సరస్సుల పునరుద్ధరణ అనేది తమ టార్గెట్ అన్నారు. పేద లేక మధ్యతరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని పేర్కొన్నారు. కొందరు హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు. హైడ్రా అధికార పరిధి ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR) వరకు మాత్రమే విస్తరించి ఉంది. కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని.. దాంతో తాము ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అన్ని కూల్చివేతలు హైడ్రా ద్వారా చేపట్టరని ప్రజలు తెలుసుకోవాలన్నారు. సరస్సులు, చెరువులు, ఇతర జలాశయాలను సంరక్షించడం తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. జలాశయాల సంరక్షణతో పాటు భారీ వర్షాలు, వరదల సమయంలో రోడ్లు, నివాస ప్రాంతాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Also Read: KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget