అన్వేషించండి

Hyderbad: మూసీపాలవుతున్న తాగునీరు…చోద్యం చూస్తోన్న జలమండలి అధికారులు

సరిపడా తాగునీరు లేనప్పుడు…నీటి కొరత తీర్చే మార్గాలు అన్వేషిస్తారు అధికారులు. జలాశయాలు పొంగిపొర్లుతున్నప్పుడు ఆ నీటిని వృధాగా వదిలేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది ఇదే…

 

భాగ్యనగర జంట జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు.. వరద నీటి ప్రవాహంతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. అయితే ఉస్మాన్‌సాగర్‌,  హిమాయత్‌సాగర్‌ నుంచి నగరానికి నీటిని తరలించడానికి ప్రతి వెయ్యి లీటర్లకు 10 రూపాయల లోపే ఖర్చవుతుంది. అదే కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్‌కు తెచ్చేందుకు అయ్యే ఖర్చు ప్రతి వెయ్యి లీటర్లకు 50 రూపాయలు. ఇందులో ఏది మెరుగు అంటే…ఎవ్వరైనా మొదటి ఆప్షనే చెబుతారు. కానీ జలమండలి అధికారులకు మాత్రం ఇది పట్టడం లేదు. వేల క్యూసెక్కుల నీరు మూసీపాలవుతున్నా చోద్యం చూస్తున్నారు.


Hyderbad: మూసీపాలవుతున్న తాగునీరు…చోద్యం చూస్తోన్న జలమండలి అధికారులు

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు రాకముందు హైదరాబాద్ వాసులకు జంట జలాశయాలే దిక్కు. ఉస్మాన్‌సాగర్‌ నుంచి 25 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్‌ నుంచి 15 ఎంజీడీలు నిత్యం తరలించేవారు. జనాభా పెరగడంతో నీరు సరిపోక కృష్ణా మూడు దశలు, గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. నగరానికి 200 కిలోమీటర్ల నుంచి మూడు దశల పంపింగ్‌తో కృష్ణా నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు తీసుకొస్తున్నారు. కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో జంట జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ రెండు గరిష్ఠ నీటిమట్టాలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి మూసీలోకి విడిచిపెడుతున్నారు.


Hyderbad: మూసీపాలవుతున్న తాగునీరు…చోద్యం చూస్తోన్న జలమండలి అధికారులు

వాస్తవానికి మూసీలోకి వదులుతున్న నీటిని తాగునీటి అవసరాలకు కూడా వాడుకునే వీలు ఉంది. ఇందుకోసం పక్కా వ్యవస్థ అందుబాటులో ఉంది. కానీ జలమండలి వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో వానలు లేవు. భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం భారీగా వరద వస్తున్నా…అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోకుండా..ఇప్పటికీ  కృష్ణా, గోదావరి జలాలపైనే ఆధారపడుతుండటం విమర్శలకు తావిస్తోంది.


Hyderbad: మూసీపాలవుతున్న తాగునీరు…చోద్యం చూస్తోన్న జలమండలి అధికారులు

మూడు నాలుగు రోజులుగా వానలు తగ్గడంతో  హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీటి ఉద్ధృతి తగ్గింది.  వరద ఉధృతి కొనసాగినప్పుడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలిపెట్టిన అధికారులు… వానలు తగ్గాక  ఉన్నతాధికారుల సూచనల మేరకు రెండు జలాశయాల గేట్లు మూసేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గడంతో జంట జలాశయాల గేట్లు మూసివేశారు. ఇప్పటి వరకు హిమాయత్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఐదు గేట్లు ఎత్తి.. 1715 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.25 అడుగుల వరకు నీరు నిలిచి ఉంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ లోకి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.80 అడుగులకు నీరు చేరింది.

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget