By: ABP Desam | Updated at : 14 Jan 2022 11:11 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గత రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగినట్లుగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడైంది. అదే సమయంలో ఈశాన్య భారతంలో అటవీ విస్తీర్ణం తగ్గగా.. ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగింది. అంతేకాక, 2019తో పోలిస్తే దేశంలో మడ అడవుల విస్తీర్ణం 17 చదరపు కిలోమీటర్లు మాత్రమే పెరిగింది. ప్రతి రెండేళ్లకు ఓ సారి తయారు చేసే ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు.
దేశంలోని మెట్రో నగరాల్లో 2011-2021 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం గ్రేటర్లో అత్యధికంగా 48.66 చదరపు కిలో మీటర్లు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19.91 చదరపు కిలో మీటర్లు పెరిగింది. ఇదే సమయంలో అహ్మదాబాద్లో 8.55 చదరపు కిలో మీటర్లు, బెంగళూరులో 4.98 చదరపు కిలో మీటర్ల చొప్పున తగ్గింది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 634.18 చదరపు కిలో మీటర్ల పరిధిలో 2011లో కేవలం 33.15 చదరపు కిలో మీటర్ల మేర పచ్చదనం ఉండగా అది 2021లో 81.81 చదరపు కిలో మీటర్లకు మీటర్లకు పెరిగింది. దీంతో నగరంలో పచ్చదనం శాతం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగినట్లయింది.
Also Read: Hyderabad: తల్లికి అంత్యక్రియలు చేసిన కొడుకు.. వెంటనే అదే శ్మశానంలో ఉరేసుకొని..
తెలంగాణలో కలిసొచ్చిన హరిత హారం
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం హరితహారం వంటి కార్యక్రమాలతో పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపట్టింది. గ్రేటర్ నగరంలో ఇప్పటి వరకు నిర్వహించిన హరిత హారం కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 4 కోట్ల మొక్కలు ప్రభుత్వం తరపున నాటారు. ప్రజలకు పంపిణీ చేసి వారి చేత కూడా మొక్కలు నాటించారు.
హైదరాబాద్లో ప్రత్యేకంగా పచ్చదనం పెంచడం కోసం జీహెచ్ఎంసీ బడ్జెట్లో గ్రీన్ బడ్జెట్ పేరిట 10 శాతం నిధులు కేటాయించారు. నగరంలోని దాదాపు 4,850 కాలనీల్లో ఎక్కడా ఖాళీ స్థలం కనబడకుండా మొక్కలు నాటే చర్యలు తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సముద్రపు తుపానులు పెరగడం, వర్షాలు కురవకపోవడం అడవుల విస్తీర్ణంలో మార్పులకు ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే
Also Read: Mahabubnagar: బైక్పై లవర్స్ త్రిబుల్ రైడింగ్.. మధ్యలో శవం, ఇంతలో షాకింగ్ సీన్
Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి
తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !