మియాపూర్లోని లక్ష్మీ ప్రెస్టీజ్ అపార్టమెంట్లో 37 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇషా సాహు ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో పాటు ఉన్న ఆరు నెలల చిన్నారి క్షేమంగా బయటపడింది.
Hyderabad Techie Suicide: హైదరాబాద్లో ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి! నిద్రలేమి సమస్యే ప్రాణం తీసిందా?
Hyderabad Techie Suicide: హైదరాబాద్ మియాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇషా సాహు పసిబిడ్డతో భవనంపై నుంచి దూకారు. నిద్రలేమి సమస్యే కారణమని అనుమానం.

- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య, ఆరు నెలల చిన్నారి క్షేమం.
- కొన్ని నెలలుగా నిద్రలేమితో తీవ్ర ఒత్తిడి ఆత్మహత్యకు దారితీసింది.
- చిన్నారి ఆసుపత్రిలో కోలుకుంటుండగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- మియాపూర్లోని లక్ష్మీ ప్రెస్టీజ్ అపార్టమెంట్లో ఆరో అంతస్తు నుంచి దూకిన 37 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది.
- తల్లి చేతుల్లోంచి జారిపడటంతో ఆరు నెలల చిన్నారి గాయాలతో బయటపడింది.
- కొన్ని నెలలుగా ఆమె తీవ్రమైన నిద్రలేమి సమస్యతో ఒత్తిడికి గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
హైదరాబాద్లో ఘోరమైన ఘటన జరిగింది. ఐటీ రంగంలో స్థిరపడిన ఒక మహిళ తన పసిపాపతో భవనంపై నుంచి దూకేసింది ప్రాణాలు తీసుకుంది. మియాపూర్లోని మయూరినగర్లో గల లక్ష్మీప్రెస్టీజ్ అపార్ట్మెంట్ శనివారం ఉదయం ఈదుర్ఘటన జరిగింది.
క్షేమంగా బయటపడ్డ చిన్నారి
మృతురాలు 37 ఏళ్ల ఇషా సాహుగా గుర్తించారు. ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తు నుంచి ఇషా తన ఆరు నెలల పసికందును చేతుల్లో పట్టుకొని కిందకు దూకారు. అయితే కిందకపడుతున్న సమయంలో చిన్నారి ఆమె చేతుల్లోంచి జారి పక్కకు పడిపోయింది దీని వల్ల ఆ బిడ్డకు ప్రాణాపాయం తప్పింది.
ఆసుపత్రిలో కోలుకుంటున్న పసిబిడ్డ
తీవ్ర గాయాలైన ఇషా సాహు స్పాట్లోనే చనిపోయింది. చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడింది. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారిని కేబీహెచ్బీలోని లోటస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు.
నిద్రలేమి అసలు సమస్యా?
పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇషా సాహు గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్యం సమస్యలతో బాధపడుతోంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఆమెను గత కొన్ని నెలలుగా వేధిస్తున్నట్టు పోలీసు గుర్తించారు. సరైన నిద్ర లేకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
నిద్రలేమి సమస్య మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇషా సాహు ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు
మియాపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల నుంచి, పొరుగువారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తి కాక ముందే సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ కలహాలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది.
నిద్రలేమి నిశ్శబ్ధ శత్రువు
పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను ఈ ఘటన గుర్తు చేస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉండే పని ఒత్తిడి, మారిన జీవనశైలి వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. వైద్య నిపుణుల ప్రకారం నిద్రలేమి అనేది కేవలం శారీరక అలసట మాత్రమే కాదు. అది తీవ్రమైన డిప్రెషన్కు దారి తీస్తుంది. ఇషా సాహు విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందనే కోణంలో విచారణాధికారులు విశ్లేషిస్తున్నారు.
Frequently Asked Questions
మియాపూర్లో జరిగిన దుర్ఘటన ఏమిటి?
ఇషా సాహు ఆత్మహత్యకు గల ప్రాథమిక కారణం ఏమిటి?
ప్రాథమిక విచారణలో, ఆమె కొన్ని నెలలుగా తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఒత్తిడికి లోనైనట్లు తేలింది. దీని వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ ఘటనలో చిన్నారి పరిస్థితి ఏమిటి?
ఆరు నెలల చిన్నారి తల్లి చేతుల్లోంచి జారి, స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడింది. ప్రస్తుతం కేబీహెచ్బీలోని లోటస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నది.
ఈ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎవరు?
ఆత్మహత్య చేసుకున్న మహిళ 37 ఏళ్ల ఇషా సాహు. ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















