Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Hyderabad Restaurants Hygiene Rating: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టాప్ హోటళ్లు, స్కూల్ క్యాంటీన్లలో బయటపడ్డ అక్రమాలు.. కేవలం సోదాలేనా? చర్యలుంటాయా?

Cyberabad Municipal Corporation Food Safety Scores: తెలంగాణలో గత కొన్ని వారాలుగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహిస్తున్న మెరుపు దాడులు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలతో సమాచారాన్ని అప్డేట్ చేస్తుండటంతో ప్రజల్లో విపరీతమైన అవేర్నెస్ వస్తోంది. మొదట్లో కేవలం బిర్యానీ పాయింట్లు, షావర్మా సెంటర్లకే పరిమితమైన ఈ తనిఖీలు.. ఇప్పుడు ఏకంగా వేలాది మంది పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల సెంట్రల్ కిచెన్ల వరకు వెళ్లాయి. అక్కడ ఈగలు ముసరడం, కుళ్లిన కూరగాయలు వాడటం వంటి దారుణాలు బయటపడటంతో తల్లిదండ్రులు వణికిపోతున్నారు. అయితే, ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. ఈ సోదాల తర్వాత ప్రభుత్వం తీసుకునే శాశ్వత చర్యలు ఏమిటి?
హోటళ్లు మారడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు?
సమాజంలో చిన్న హోటళ్లు లేదా బడ్జెట్ రెస్టారెంట్లు కొన్ని చోట్ల మెరుగైన మార్కులు సాధిస్తున్నప్పటికీ.. బ్రాండ్ ఇమేజ్ ఉండి, ప్లేట్ బిర్యానీకి వందల రూపాయలు వసూలు చేసే హైదరాబాద్లోని కొన్ని లగ్జరీ, ప్రముఖ హోటళ్ల కిచెన్లు అత్యంత నాసిరకంగా, అనారోగ్యానికి కారణమయ్యేలా ఉండటం షాక్కు గురిచేస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్ ఏరియాల్లోని పలు టాప్ రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం, కాలం చెల్లిన ఫుడ్ కలర్స్, ఫ్రీజర్లలో బొద్దింకలు, పురుగులు పట్టడం వంటి దారుణాలను టాస్క్ ఫోర్స్ బట్టబయలు చేసింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన జూన్ 2026 నివేదిక ప్రకారం.. కొన్ని ప్రముఖ రెస్టారెంట్ల హైజీన్ స్కోర్ కేవలం 18% నుండి 35% మధ్యే ఉండటం ఇక్కడి తీవ్రతను సూచిస్తోంది.
హైదరాబాద్ చివరి స్థానం
ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని మెట్రో నగరాల్లో ఫుడ్ హైజీన్ రేటింగ్స్ పొందడంలో హైదరాబాద్ అత్యంత చివరి స్థానంలో నిలిచింది. నగరంలోని సుమారు 25 వేల లైసెన్స్డ్ హోటళ్లలో కేవలం 2 శాతం 361 హోటల్లు మాత్రమే ఈ రేటింగ్స్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేసి ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇవ్వడం లేదా స్వల్ప జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. అయితే అత్యంత శుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు హోటళ్లపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారు? భవిష్యత్తులో ఎలాంటి స్పష్టమైన నిబంధనలు పెడతారు? అనే దానిపై ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. కేవలం సోదాలు చేసి వదిలేస్తే.. అధికారులు వెళ్లిన రెండు రోజులకే హోటల్ యాజమాన్యాలు మళ్లీ పాత పద్ధతిలోనే అపరిశుభ్ర వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
ఫుడ్ హైజీన్ స్కోర్ కార్డ్ అమలు తప్పనిసరా?
ఈ గందరగోళానికి చెక్ పెడుతూ, రెస్టారెంట్లు కచ్చితంగా దారికి వచ్చేలా ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ హైజీన్ రేటింగ్ విధానం కేవలం ఐచ్ఛికం గా మాత్రమే ఉంది. దీనివల్ల చాలా హోటళ్లు సర్టిఫికేషన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనిని నియంత్రిస్తూ.. రాబోయే రోజుల్లో ప్రతి చిన్న, పెద్ద హోటల్ తమ ఎంట్రన్స్ వద్ద కస్టమర్లకు స్పష్టంగా కనిపించేలా ఫుడ్ హైజీన్ స్కోర్ కార్డ్ లేదా స్టార్ రేటింగ్ను ప్రదర్శించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలు పదే పదే ఉల్లంఘించే హోటళ్ల లైసెన్సుల రద్దు
ఈ సోదాల పర్వం ముగిసిన తర్వాత రెండో దశ యాక్షన్ ప్లాన్ కింద.. నిబంధనలు పదే పదే ఉల్లంఘించే హోటళ్ల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు, సదరు యాజమాన్యాలపై నాన్-బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చట్ట సవరణలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, స్కూల్ కల్చర్, పబ్లిక్ మెస్లలో క్వాలిటీ కంట్రోల్ కోసం ప్రతి జోన్కు ఒక ప్రత్యేక మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ను అందుబాటులోకి తెస్తున్నారు. నిరంతర నిఘా, కఠినమైన జరిమానాలు మరియు డిజిటల్ రేటింగ్స్ సిస్టమ్ను అనుసంధానించడం ద్వారానే హైదరాబాద్ గ్యాస్ట్రోనమీ బ్రాండ్ ఇమేజ్ కాపాడటంతో పాటు ప్రజల ఆరోగ్యానికి పూర్తి భద్రత చేకూరుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















