Weather Updates: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Telangana Rains News Update | దక్షిణ కోస్తాంద్ర మీదుగా కొనసాగులున్న ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Rains In Andhra Pradesh | హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అవుతోంది. ఆగస్టు నెలలోనే మూడు పర్యాయాలు 100 మి.మీకు పైగా వర్షపాతం నమోదు అయింది. ఆదివారం నాడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వీటితోపాటు నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సోమవారం సైతం తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది.
నేడు ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో సోమవారం ఉదయం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :10-08-2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @Indiametdept pic.twitter.com/7Vx8ZrRLag
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 10, 2025
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు మరియు ఎల్లుండి ఏపీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. చెట్ల క్రింద, శిథిల భవనాలు మరియు హోర్డింగ్స్ వద్ద ఉండకూడదని సూచించింది.
బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.దీని ప్రభావంతో రేపు,ఎల్లుండి రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది. pic.twitter.com/14clWLB1GA
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 10, 2025






















