అన్వేషించండి

Kokapet Land Price: కోకాపేట్ భూముల వేలంలో ఆల్ టైం రికార్డ్! రూ.100 కోట్లు దాటిన ఎకరం భూమి రేటు

వేలంలో వివిధ కంపెనీలు భూములను భారీ రేటు చెల్లించి దక్కించుకున్నాయి. చరిత్రలో అత్యధికంగా ఎకరం రూ.100 కోట్ల ధర దాటింది.

హైదరాబాద్ లో భూముల ధరలు చరిత్ర సృష్టించాయి. హెచ్‌ఎండీఏ కోకాపేట ఏరియాలో - నియోపోలిస్‌ ఫేజ్‌-2 భూముల వేలం నేడు ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో వివిధ కంపెనీలు భూములను భారీ రేటు చెల్లించి దక్కించుకున్నాయి. చరిత్రలో అత్యధికంగా ఎకరం రూ.100 కోట్ల ధర దాటింది. ఇంత భారీ స్థాయిలో ధర పలకడం సంచలనంగా మారింది. నియో పోలిస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎకరం భూమి ధర రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను తొలుత నిర్ణయించింది. 

ఈ వేలంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడగా, ఉదయం నుంచి వివిధ ప్లాట్లు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. సాయంత్రానికి ఈ వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రేటు రూ.100.75 కోట్లతో పాడుకొని మరీ ఓ సంస్థ దక్కించుకుంది. అతి తక్కువ ధరే రూ.51.75 కోట్లు పలకడం విశేషం. 

ప్రభుత్వ ధర రూ.35 కోట్లే

కోకాపేటలోని నియోపోలిస్ ఫేజ్ - 2 హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూముల వేలాన్ని నేడు (ఆగస్టు 3) నిర్వహించారు. 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేసింది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ వేలం కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ ధర ఒక ఎకరానికి రూ.35 కోట్లుగా నిర్ణయించారు.

ఇలా నియో పోలిస్‌ ఫేజ్‌ - 2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.1,532.50 కోట్ల మేర ఊహించని ఆదాయం ఖజానాకు చేరబోతోంది. గురువారం (ఆగస్టు 3) ఉదయమే 26.86 ఎకరాలకు వేలం పూర్తికాగా, దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీలు పడి మరీ కొనుక్కున్నాయి. మైహోం, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, రాజపుష్ప లాంటి పేరొందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేలంలో పాల్గొన్నాయి.

100 కోట్లు దాటిన పదో నెంబరు ప్లాటు

సాయంత్రం నుంచి 10, 11, 14  నెంబరు ప్లాట్ల వేలం జరిగింది. ఈ మూడు ప్లాట్ల విస్తీర్ణం 18.47 ఎకరాలు. వీటిలో 10వ నెంబరు ప్లాటు చారిత్రాత్మక ధర పలికి.. ఎకరం రూ.100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల్లో ఈ పదో నెంబరు ప్లాటు ఉంది. ఈ ఒక్క పదో నెంబరు ప్లాటు వల్లనే రూ.360 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

హెచ్ఎండీఏ పెట్టిన ఖర్చు రూ.300 కోట్లు
కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్‌ కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్‌లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లో ప్లాట్లు కొంత కాలంగా వేలం వస్తున్నారు. 2021లో మొదటి ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలం వేశారు. అప్పట్లో ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్‌ పార్ట్‌ గల ప్లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్‌ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతం చేసుకుంది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు అప్పుడు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhogi Wishes: భోగి మంటలతో సమస్యలు తీరిపోయి భోగ భాగ్యాలు కలగాలి- సీఎంల భోగి శుభాకాంక్షలు
Bhogi Wishes: భోగి మంటలతో సమస్యలు తీరిపోయి భోగ భాగ్యాలు కలగాలి- సీఎంల భోగి శుభాకాంక్షలు
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogi Wishes: భోగి మంటలతో సమస్యలు తీరిపోయి భోగ భాగ్యాలు కలగాలి- సీఎంల భోగి శుభాకాంక్షలు
Bhogi Wishes: భోగి మంటలతో సమస్యలు తీరిపోయి భోగ భాగ్యాలు కలగాలి- సీఎంల భోగి శుభాకాంక్షలు
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Mahakumbh 2025 : మహా కుంభమేళా మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా ?
మహా కుంభమేళా మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా ?
Naga Sadhu in Mahakumbh : నాగ సాధువులకు చలి పెట్టదా? - ఎప్పుడూ అలా నగ్నంగా ఎలా ఉంటారు?, దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!
నాగ సాధువులకు చలి పెట్టదా? - ఎప్పుడూ అలా నగ్నంగా ఎలా ఉంటారు?, దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!
Embed widget