అన్వేషించండి

Mlc Kavitha : ప్రజల పైసలతో కేంద్రం ఆటలు, ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతున్నా మోదీ మౌనం- ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతున్నా కేంద్రం అదానీ వ్యవహారంలో మౌనం వీడడంలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

Mlc Kavitha : ప్రజల పైసలతో కేంద్రం ఆటలాడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే కేంద్రం మౌనంగా ఎందుకుందని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అంటూ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల కవిత తీవ్రంగా స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏంటని ధ్వజమెత్తారు. ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.

పెద్ద కుంభకోణం 

ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు 12 లక్షల కోట్లు నష్టపోయినా సీబీఐ, ఈడీ, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా అని నిలదీశారు. హిండెన్ బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. అప్పుడే కేంద్రం జేపీసీ ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత నష్టపోయేవారు కాదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి మరింత నష్టం జరగకుండా చూడాలని సూచించారు. జేపీసీని నియమించాలని కవిత డిమాండ్ చేశారు. 

ఆల్ టైమ్ కనిష్టానికి ఎల్ఐసీ

శుక్రవారం (25 ఫిబ్రవరి 2023) ట్రేడింగ్‌లో, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (LIC) షేర్లు 1% పైగా పడిపోయాయి, రూ. 585 వద్ద ముగిశాయి. ఈ స్టాక్‌, తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ. 582 కంటే ఒక్క అంగుళం పైన మాత్రమే ప్రస్తుతం ఉంది.  అదానీ గ్రూప్ షేర్లలో పతనం కారణంగా, ఆ గ్రూప్‌ షేర్లలో ఎల్‌ఐసీ లాభాలు అత్యంత భారీ స్థాయిలో ఆవిరవడం కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. అదానీ తుపాను మొదలైన నాటి నుంచి, గత నెల రోజుల్లో, LIC షేర్‌ ధర దాదాపు 15% తగ్గింది. BSE సమాచారం ప్రకారం... అదానీ గ్రూప్‌లోని అదానీ పోర్ట్స్ & సెజ్‌లో LIC అతి పెద్ద పెట్టుబడి ఉంది, ఆ కంపెనీలో 9.1% వాటాను కలిగి ఉంది. ఇతర ఆరు అదానీ గ్రూప్ కంపెనీల్లో 1.25% నుంచి 6.5% మధ్య వాటాలు ఉన్నాయి.  శుక్రవారం సెషన్‌లో, అదానీ గ్రూప్‌లోని 10 కౌంటర్లలో ఏడు నష్టాల్లో ముగిశాయి. ఈ ఏడు కౌంటర్లలో, నాలుగు స్టాక్స్‌ - అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ మరియు అదానీ పవర్ - వాటి 5% లోయర్ సర్క్యూట్‌లోకి పడిపోయాయి. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 5% నష్టంతో ముగిసింది. అదానీ విల్మార్ 3.3% దిగువన ముగియ, NDTV 4.1% క్షీణించింది.  మిగిలిన స్టాక్స్‌లో... అంబుజా సిమెంట్స్ 2.4% లాభంతో ముగియగా, అదానీ పోర్ట్స్ & సెజ్‌ 1.2% పెరిగింది. ACC ఎటువంటి మార్పు లేకుండా డే క్లోజ్‌ చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Advertisement

వీడియోలు

Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Mental Stress Relief Tips : మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే ఎఫెక్టివ్‌ టిప్స్‌ ఇవే!
మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే ఎఫెక్టివ్‌ టిప్స్‌ ఇవే!
Bike Fuel Efficiency Tips: రోజువారీ రైడింగ్‌లో మీ బైక్‌ మైలేజ్‌ పెంచుకోవడానికి 10 సులభమైన చిట్కాలు
ఇంధన ఖర్చు తగ్గించ్చేద్దాం?, మీ బైక్‌ మైలేజ్‌ పెంచే 10 సింపుల్‌ మార్గాలు
Jarann OTT : ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'జారన్' - చేతబడి కథ... ఎట్టకేలకు తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'జారన్' - చేతబడి కథ... ఎట్టకేలకు తెలుగులోనూ స్ట్రీమింగ్
శ్రీ చరణి నుంచి స్మృతి మంధాన వరకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఇదే! ఏ రాష్ట్రం ఎన్ని కోట్లు ఇచ్చింది?
శ్రీ చరణి నుంచి స్మృతి మంధాన వరకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఇదే! ఏ రాష్ట్రం ఎన్ని కోట్లు ఇచ్చింది?
Embed widget