అన్వేషించండి

Governor Tamilisai: రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే, ప్రభుత్వ తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్తా - గవర్నర్ అసహనం

ప్రభుత్వ ఈ నిర్ణయంపై గవర్నర్‌ తమిళిసై ఆవేదన చెందారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదని అన్నారు.

Republic Day Celebrations 2023: గణతంత్ర దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరపకపోవడంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అసహనం వ్యక్తం చేశారు. రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ రాసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వేడుకలు జరపడం లేదని లేఖలో కారణంగా చెప్పారు. అయితే, ప్రభుత్వ ఈ నిర్ణయంపై గవర్నర్‌ తమిళిసై ఆవేదన చెందారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని తాను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై తెలిపారు. 

కొవిడ్‌ కారణంగా గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో కరోనా మూడో వేవ్ మొదలు అవుతోంది. గణతంత్ర వేడుకల నిర్వహణ విషయమై అప్పట్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన గవర్నర్ ప్రసంగం కూడా పంపలేదని పేర్కొన్నారు. అయితే కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహించింది. ఆ సభకు మూడు రాష్ట్రాల సీఎంలు సహా జాతీయ నేతలు హాజరు అయ్యారు. లక్షల్లో జనం వచ్చారు. అయితే, ఆ సభకు రాని కొవిడ్ నిబంధనల అడ్డు గణతంత్ర వేడుకలు నిర్వహించడానికి వచ్చాయా? అని గవర్నర్ తమిళిసై వాపోయారు. గవర్నర్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి తాను కేంద్రానికి వివరిస్తానని తమిళిసై వివరించారు.

జనవరి 26న గవర్నర్ తమిళిసై రాజ్ భవన్‌లోనే జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో కూడా తమిళిసై పాల్గొననున్నారు. పుదుచ్చేరికి కూడా తమిళిసై లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి మరింత పెరిగిన విభేదాలు

కేసీఆర్‌కు, గవర్నర్‌ తమిళిసైల మధ్య పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదించినప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. సీఎంవో పంపిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడం ఈ విభేదాలు మొదలయ్యేందుకు కారణం అయింది. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరంగానే ఉన్నారు. రాజ్ భవన్​లో గవర్నర్ జెండాను ఆవిష్కరించే సమయంలో సీఎం కేసీఆర్ ఉండాలి.. కానీ వేడుకలకు సీఎం హాజరుకాలేదు. ఆ తర్వాత తమిళిసై తెలంగాణలో ఏ పర్యటనకు వెళ్లినా ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన కలెక్టర్ ఆ రోజు సెలవులో ఉండడం, ప్రభుత్వం హెలికాప్టర్ సదుపాయం కల్పించకపోవడం వంటివి చర్చనీయాంశం అయ్యాయి. గత వరదల సందర్భంగా గవర్నర్ భద్రాచలానికి రైలులో ప్రయాణించడం కూడా అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

టాప్ హెడ్ లైన్స్

TGREDCO DE Venkata Ramana ACB Raid: మరో అవినీతి అధికారి అక్రమాస్తులు వంద కోట్లపైనే - టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఆస్తుల కుప్ప !
మరో అవినీతి అధికారి అక్రమాస్తులు వంద కోట్లపైనే - టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఆస్తుల కుప్ప !
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Balakrishna Health Bulletin: నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget