అన్వేషించండి

Governor Tamilisai: రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే, ప్రభుత్వ తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్తా - గవర్నర్ అసహనం

ప్రభుత్వ ఈ నిర్ణయంపై గవర్నర్‌ తమిళిసై ఆవేదన చెందారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదని అన్నారు.

Republic Day Celebrations 2023: గణతంత్ర దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరపకపోవడంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అసహనం వ్యక్తం చేశారు. రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ రాసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వేడుకలు జరపడం లేదని లేఖలో కారణంగా చెప్పారు. అయితే, ప్రభుత్వ ఈ నిర్ణయంపై గవర్నర్‌ తమిళిసై ఆవేదన చెందారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని తాను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై తెలిపారు. 

కొవిడ్‌ కారణంగా గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో కరోనా మూడో వేవ్ మొదలు అవుతోంది. గణతంత్ర వేడుకల నిర్వహణ విషయమై అప్పట్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన గవర్నర్ ప్రసంగం కూడా పంపలేదని పేర్కొన్నారు. అయితే కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహించింది. ఆ సభకు మూడు రాష్ట్రాల సీఎంలు సహా జాతీయ నేతలు హాజరు అయ్యారు. లక్షల్లో జనం వచ్చారు. అయితే, ఆ సభకు రాని కొవిడ్ నిబంధనల అడ్డు గణతంత్ర వేడుకలు నిర్వహించడానికి వచ్చాయా? అని గవర్నర్ తమిళిసై వాపోయారు. గవర్నర్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి తాను కేంద్రానికి వివరిస్తానని తమిళిసై వివరించారు.

జనవరి 26న గవర్నర్ తమిళిసై రాజ్ భవన్‌లోనే జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో కూడా తమిళిసై పాల్గొననున్నారు. పుదుచ్చేరికి కూడా తమిళిసై లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి మరింత పెరిగిన విభేదాలు

కేసీఆర్‌కు, గవర్నర్‌ తమిళిసైల మధ్య పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదించినప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. సీఎంవో పంపిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడం ఈ విభేదాలు మొదలయ్యేందుకు కారణం అయింది. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరంగానే ఉన్నారు. రాజ్ భవన్​లో గవర్నర్ జెండాను ఆవిష్కరించే సమయంలో సీఎం కేసీఆర్ ఉండాలి.. కానీ వేడుకలకు సీఎం హాజరుకాలేదు. ఆ తర్వాత తమిళిసై తెలంగాణలో ఏ పర్యటనకు వెళ్లినా ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన కలెక్టర్ ఆ రోజు సెలవులో ఉండడం, ప్రభుత్వం హెలికాప్టర్ సదుపాయం కల్పించకపోవడం వంటివి చర్చనీయాంశం అయ్యాయి. గత వరదల సందర్భంగా గవర్నర్ భద్రాచలానికి రైలులో ప్రయాణించడం కూడా అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ 
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ 
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Embed widget