అన్వేషించండి

KTR News: రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?

KTR News: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ ముందు హజరవనున్నారు. అడ్వకేట్ లేకుండానే కేటీఆర్ ఈడీ ముందు హజరుకానున్నారు.

KTR News: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరుకానున్నారు. అడ్వకేట్ లేకుండానే కేటీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించారని, ఇది మనీ లాండరింగ్, ఫెమా నింబధనల ఉల్లంఘనగా జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగానే జరిగిన చెల్లింపులు కేంద్ర ప్రభుత్వ, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఈడీ కేటీఆర్‌ను విచారించనుంది. ఇంతకు ముందే ఏసీబీ నుంచి ఆ వివరాలను ఈడీ తెప్పించుకుంది. 

అభియోగాలు ఇవే....
అక్రమాలు జరిగాయని ఏసీబీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం 13 (1) ఏ, 13(2), ఐపీసీ సెక్షన్ 409, 120-బి కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసు సీజన్ 9,10,11,12 నిర్వహణకు యుకేకు చెందిన ఫార్ములా ఈ ఆరేషన్స్‌కు స్పాన్సర్ కంపెనీ అయిన ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలక శాఖ మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తొలి సీజన్‌ను 2023 ఫిబ్రవరి 11న నిర్వహించారు. దీనికి నిర్వహణ ఖర్చు కింద హెచ్ఎండీఏ 12 కోట్లు ఖర్చు పెట్టింది. 

అయితే స్పాన్సర్ కంపెనీకి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు మధ్య విబేధాలు రావడంతో స్పాన్సర్ కంపెనీ పక్కకు తప్పుకుంది. దీంతో తామే ఆన్ని ఖర్చులు భరించేందుకు సిద్ధమని తెలంగాణ పురపాలక శాఖ స్పాన్సర్ కంపెనీ స్థానంలో ఉండి ఒప్పందం చేసుకుంది. ఇలా ఆ తర్వాతి సీజన్లలో ఫీజులు, ఖర్చులు, పన్ను చెల్లింపుల రూపంలో పురపాలక శాఖ 55 కోట్లు యూకే కంపెనీ ఖాతాలోకి సాధారణ నిధుల నుంచి తరలించింది. క్యాబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇలా చెల్లింపులు జరపడం చట్ట విరుద్దం. అంతే కాకుండా హెచ్ఎండీఏ పది కోట్లకు మించి ఖర్చు చేయాలంటే పరిపాలనపరమైన అనుమతులు ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. కాని ఇది జరగలేదు. విదేశీ మారక ద్రవ్యంలో చెల్లింపులు జరిగాయి. ఇది ఫారిన్ ఎక్సెంజ్ రెమిటెన్స్ నిబంధనలకు వ్యతిరేకం. ఆర్బీఐకు, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదు. ఎన్నికల సందర్భంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి కాని అనుమతి లేకుండా చెల్లింపుల వ్యవహారం జరిగింది.

Also Read: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియామకం

కేసులు వీరిపైనే 
ఏసీబీ కేసులో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్,  ఏ2గా సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డి ఉన్నారు. వీరిని ఇప్పటికే విడివిడిగా ఏసీబీ విచారించింది. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధులను విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిపామని సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్,  చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డి ఎసీబీ ముందు చెప్పారు. దీంతో కేటీఆర్‌ను ఏ1గా చేర్చిన ఏసీబీ ఆయన్ని ఇప్పటికే విచారించింది.  జనవరి 9వతేదీన ఎసీబీ ఏడు గంటలపాటు కేటీఆర్‌ను విచారంచిన విషయం తెలిసిందే. మరో దఫా ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఈడీ ఏం తెలుసుకోనుంది.

ఏసీబీ ఏఫ్. ఐ. ఆర్‌లో పేర్కొన్న అంశాలపై ఈడీ రేపు ఉదయం పది గంటలకు కేటీఆర్‌ను విచారించనుంది. అడ్వకేట్ లేకుండానే ఈడీ కేటీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం. ఈ ఫార్ములా రేస్ కేస్‌లో ఒప్పందాలు ఏం చేసుకున్నారు.  ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు.  ఫెమా నిబంధనలను ఉల్లఘించి విదేశీ కంపెనీకి నిధులు ఎంత పంపారు. ఎలా పంపారు. అవి చివరికి ఎవరి ఖాతాలో పడ్డాయి. ఇందులో కేటీఆర్‌తోపాటు అధికారు పాత్ర ఎంత. ఏ ఉద్దేశంతో ఈ వ్యవహారం నడచింది. అన్న వివరాలను ఈడీ తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈడీ కేటీఆర్‌పైకేసు పట్టే అవకాశాలను పరిశీలంచనుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Also Read: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget