అన్వేషించండి

Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

Fish Prasadam distribution | మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది తరహాలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. జూన్ 8న రాత్రి 9 గంటలకు ప్రారంభించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో జూన్ 8 రాత్రి చేప ప్రసాదం పంపిణీ మొదలు.
  • మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను సమీక్షించారు; భక్తుల విశ్వాసం అధికం.
  • భక్తులకు వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు.

Fish Medicine | హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. జూన్ 8వ తేదీ రాత్రి చేప ప్రసాదం పంపినీ ప్రారంభించనున్నారు. 9వ తేదీన సైతం పంపిణీ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులతో కలిసి చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వందల సంవత్సరాలుగా చేప ప్రసాదంపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, ఈ క్రమంలో మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

జూన్ 8న రాత్రి 9 గంటలకు ప్రారంభం

సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ఉదయం పూట వస్తుందని, అయితే ఈసారి జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు మృగశిర కార్తె ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, రాత్రి సమయంలో పంపిణీకి అవసరమైన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, విధుల్లో ఎవరూ అప్రమత్తత వీడకూడదని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

మృగశిర కార్తె సందర్భంగా వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెలుపలి ప్రాంతాల నుండి వచ్చేవారికి వసతి, ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పంపిణీకి కావలసినన్ని చేప పిల్లలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని, ట్రాఫిక్, తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో దాదాపు రెండు శతాబ్దాల నుంచి ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని ఫ్యామిలీ చేపప్రసాదం పంపిణీ చేస్తోంది. లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉండటంతో లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సాధారణ ప్రజలకు త్వరితగతిన ప్రసాదం అందేలా చూసేందుకు ఈసారి వీఐపీ పాస్‌ల జారీని పరిమితం (లిమిట్) చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం సరిపడా తాగునీరు, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటుతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత భోజన సదుపాయాలు కల్పించేలా సర్వం సిద్ధం చేస్తున్నారు.

 

Frequently Asked Questions

చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడు జరుగుతుంది?

చేప ప్రసాదం పంపిణీ జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమై జూన్ 9వ తేదీ రాత్రి వరకు కొనసాగుతుంది. ఇది మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా జరుగుతుంది.

చేప ప్రసాదం పంపిణీకి ఎవరు ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?

తెలంగాణ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం వసతి, ఉచిత భోజనం, తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఈసారి చేప ప్రసాదం పంపిణీ రాత్రిపూట ఎందుకు ప్రారంభమవుతుంది?

సాధారణంగా ఉదయం వచ్చే మృగశిర కార్తె ఈసారి జూన్ 8న రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని పంపిణీ రాత్రికి ఏర్పాటు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 9వ తరగతి విద్యార్థులకు థర్డ్ ల్యాంగ్వేజ్ వద్దు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
9వ తరగతి విద్యార్థులకు థర్డ్ ల్యాంగ్వేజ్ వద్దు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget