అన్వేషించండి

Falaknuma Fire Accident: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి కారణమిదే! ఆ బోగీలోనే మంటలు చెలరేగాయన్న క్లూస్ టీమ్

Reason for Falaknuma Express Fire Accident: ఫలక్​నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రైలు ప్రమాదంపై కీలక అప్ డేట్ వచ్చింది.

Reason for Falaknuma Express Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఫలక్​నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రైలు ప్రమాదంపై కీలక అప్ డేట్ వచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని క్లూస్ టీమ్ అనుమానం వ్యక్తం చేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించిన టీమ్.. ఎస్ 4 కంపార్ట్ మెంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. వేడి కారణంగా వైర్లు కాలిపోవడం లేదా ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా విద్యుదాఘతం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎస్4 బోగీ నుంచే ఇతర బోగీలకు మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా గుర్తించారు. ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన బోగీలు మొత్తం పరిశీలించిన క్లూస్ టీమ్ వందకు పైగా శాంపిల్స్ కలెక్ట్ చేసింది. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించనున్నారు. ల్యాబ్ లో చెక్ చేశాక వచ్చే నివేదికలో ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలపనుంది. 

శుక్రవారం ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం..
ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదంపై అధికారులు కేసు నమోదు చేశారు. నల్గొండ జి.ఆర్.పి స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో 5 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు రైల్వే యాక్ట్‌ సెక్షన్‌ 80/2023 కింద కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఒక బోగీ పాక్షికంగా దగ్దమైనట్లు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బోమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన రైలు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని సందర్శించారు.
Also Read: KTR About PM Modi: రూ.20 వేల కోట్లు గుజరాత్ కు! తెలంగాణకు మాత్రం రిపేర్ షాప్- ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్

పశ్చిమ బెంగాల్​లోని హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్​నుమా రైలులో యాదాద్రి జిల్లా పగిడిపల్లి- బొమ్మాయిపల్లి మధ్య మంటలు చెలరేగాయి. వెంటనే రైలు నిలిపివేసి ప్రయాణికుల్ని దించేయడంతో ప్రాణనష్టం తప్పింది.  ఐదు బోగీలు పూర్తిగా కాలిపోగా, మరికొన్ని బోగీలులకు సైతం మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎస్4, ఎస్5, ఎస్6 బోగీలు పూర్తిగా దగ్గం కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం రైల్వే అధికారులు మిగతా బోగీలను సికింద్రాబాద్ స్టేషన్ కు తరలించారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను సైతం సికింద్రాబాద్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల కోరమండల్ ఎక్స్ ప్రెస్ జరిగిన కారణంగా ఎక్కడ రైలు ప్రమాదం జరిగిందన్న ఆందోళన అధికం అవుతోంది. ఒడిశాలో జరిగినట్లు పెద్ద రైలు ప్రమాదం జరిగితే తమ ప్రాణాలు పోయేవని ప్రయాణికులు చెబుతున్నారు.
Also Read: RS Praveen Kumar: సిర్పూర్ నుంచే ఎన్నికల బరిలోకి - అధికారికంగా ప్రకటించిన ప్రవీణ్ కుమార్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
Telangana News : జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
Viral News: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
Sriprakash Vinnakota: టీపీసీసీ మెడికల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ శ్రీప్రకాష్‌ విన్నకోట నియామకం!
టీపీసీసీ మెడికల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ శ్రీప్రకాష్‌ విన్నకోట నియామకం!

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
Nobel Peace: నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Embed widget