అన్వేషించండి

Bhatti Vikramarka: మా గ్యారెంటీల సంగతి సరే, పదేళ్లలో మీరేం చేశారు - బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం

Telangana Budget 2024 : తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో భట్టి మాట్లాడారు.

Bhatti Vikramarka:గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్‌ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇవ్వడం తప్పా?. మహిళలను ఆదుకోవడం తప్పా?. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం తప్పా?. మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్‌ఎస్‌ ఏం చేసిందని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు.  మేము పెట్టిన పీపుల్స్ మార్చ్ బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలు సానుకూలంగా స్పందిస్తారని ఆశించానన్నారు. బడ్జెట్ బాగుంది.. బాగాచేశారు. ప్రజల కోసం మీరు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ బాగా కష్టపడుతోందని అంటారని ఆశించా అని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

మీరు ఇప్పుడే వచ్చారు.. ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉంది. మీకు సమయం ఇస్తున్నాం అనే ఆలోచన చేస్తారని అనుకున్నా. కానీ కాంగ్రెస్ మీద దాడి చేయడం తప్ప హరీష్ రావు మాట్లాడిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు పాలన చేని అంతిమంగా మీరు చెప్పిన ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. మేము తక్కువ కాలంలోనే చాలా పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. తాము రైతన్నల గురించి ఆలోచన చేసి రూ.72,659 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించాం. హైదరాబాద్ నగరాభివృద్ధి , మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కింద రూ.15,594 కోట్లు ఇచ్చాం. ఎస్సీ సబ్ ప్లాన్ గురించి రూ. 33124 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ.1,756 కోట్లు కేటాయించాం. మాది రియలిస్టిక్ బడ్జెట్ అని భ‌ట్టి విక్ర‌మార్క‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు.


20 ఏళ్లు మేమే ఉంటాం
రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందన్నారు. దేశం గర్వించేలా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లు  ఎస్సీ, ఎస్టీ నిధులను పక్కదారి పట్టించిందన్నారు.  ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్​ స్కిల్​ డెవలప్​ మెంట్​ సెంటర్లు ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత బిఆర్‌ఎస్‌దేనని   మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్నది అక్షరాల తప్పుడు ప్రచారమని భట్టి విక్రమార్క మండిపడ్డారు.  పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయకుండా వెళ్లినవారు ఇప్పుడు మాపై మాటల దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది నెలలే అయ్యిందని అందులో మూడు నెలలు ఎన్నికల కోడ్‌లోనే గడిపోయిందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లుగా బడ్జెట్ ఊహాజనితంగా ఎక్కడుందంటూ ప్రశ్నించారు.

హైదరాబాద్ కోసమే రూ.10వేల కోట్లు
వ్యవసాయం కోసం రూ.72 వేల కోట్లు కేటాయించడం తప్పా.? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయించడం తప్పా అని ప్రతిపక్షాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కోసం బడ్జెట్‌లో రూ. 17,056 కోట్లు , మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 30 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామంటూ గుర్తు చేశారు. మరో 35 వేల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని, నాలుగు నెలల్లోనే 65 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే అన్నారు. రుణమాఫీపై కొందరు ఎగతాళి చేశారని..  ఎంత కష్టమైనా రుణమాఫీపై ముందుకెళ్తుతున్నామని గుర్తు చేశారు.

రైతు కూలీలకు రూ.12వేలు 
 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ఈ ఏడాది నుండే ఇస్తామన్నారు. త్వరలో స్పష్టమైన విద్యుత్​ పాలసీని అమలు చేస్తామన్నారు.  2035 వరకు విద్యుత్​ పాలసీని సిద్ధం చేశామని ఉపముఖ్యమంత్రి అన్నారు.  ఏదో ఐదేళ్లు గడిపేయడానికి మేం అధికారంలోకి రాలేదని, తమ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందన్నారు.  దేశం గర్వించేలా తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను తీసుకువస్తామన్నారు. దాదాపు 20 నుండి 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థుల తయారు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  తెలంగాణ నూతన విద్యా విధానం దేశానికి ఆదర్శం కాబోతుందన్నారు.

ప్రతి ఒక్కరికి సొంతిల్లు
ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్​ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు. త్వరలోనే 4.5  లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామన్నారు. గ్యారంటీలను అమలు చేసేందుకు మంత్రులందరూ కష్టపడి చేస్తున్నారని భట్టి అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా స్కిల్​ డెవలప్​ మెంట్​ యూనివర్శిటీకి రూపకల్పన చేశామన్నారు. రైతు భరోసా అమలులో ప్రజాధనం వృథా కాకూడదనే.. రైతుల నుంచి సలహాలు తీసుకుంటున్నామన్నారు. పదేళ్లుగా పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.  తమ ప్రభుత్వంలో 16వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించినట్లు వివరించారు. అభివృద్ధి చర్యల ఫలాలు ఐదు, పదేళ్ల తర్వాత కనిపిస్తాయని ఉద్ఘాటించారు.  

బీఆర్ఎస్ వి అన్ని మోసాలే
బీఆర్ఎస్ పార్టీ ఏమి చేప్పింది?? ఏమి చేసిందో అందరికీ తెలుసని భట్టి విక్రమార్క అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు.. చేశారా?.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా?  ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా? ప్రతి మండలంలో  బాలురుకు, బాలికలకు ప్రత్యేకంగా రెండు నుంచి మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ కడతామని చెప్పారు.. కట్టారా?? అని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలకు గురించి చెప్పాల్సిన పనిలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ప్రతి గ్యారంటీనీ అమలు చేసేందుకు తపిస్తున్న ప్రభుత్వం మాది. ప్రభుత్వంలోని ప్రతి మంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకూ వారివారి కార్యలయాల్లో సమీక్షలు నిర్వహిస్తూ.. పనిచేస్తున్నారు. గ్యాస్ సిలండర్ ను రూ. 500కే అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
Hyderabad Real Estate News: ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
TRS Party: కవిత టీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ ఓకే కానీ పేరులో చిన్న మార్పు! రక్షణ సేనగా మారిన రాష్ట్ర సేన!
కవిత టీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ ఓకే కానీ పేరులో చిన్న మార్పు! రక్షణ సేనగా మారిన రాష్ట్ర సేన!
Hyderabad Mango Pickle Season: అమెరికా నుంచి అనకాపల్లి వరకూ నోరూరిస్తున్న హైదరాబాద్ ఆవకాయ్‌! పచ్చళ్ల సీజన్‌లో సరికొత్త ట్రెండ్!
అమెరికా నుంచి అనకాపల్లి వరకూ నోరూరిస్తున్న హైదరాబాద్ ఆవకాయ్‌! పచ్చళ్ల సీజన్‌లో సరికొత్త ట్రెండ్!

వీడియోలు

Mumbai Indians Batting Failure IPL 2026 | ముంబై వరుస పరాజయాలకు కారణం ఏంటి ?
Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే
Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
Hyderabad Real Estate News: ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
Andhra Pradesh Cabinet meeting: ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Hansika: బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
Bellamkonda Sai Sreenivas Weds Kavya: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు... తిరుమలలో ఏడడుగులు వేసిన హీరో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు... తిరుమలలో ఏడడుగులు వేసిన హీరో
Kara Review - కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?
కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?
Embed widget