By: ABP Desam | Updated at : 02 Sep 2023 07:06 AM (IST)
తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ...934 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
తెలంగాణ...పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతున్న రాష్ట్రానికి...అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయ్. తాజాగా మెటీరియల్ సైన్సెస్ లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ...తెలంగాణ పెట్టుబడులు పెట్టబోతోంది. దేశంలో మొదటిసారి స్మార్ట్ఫోన్లకు వినియోగించే... గొరిల్లా గ్లాస్ తయారు చేయడానికి ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అమెరికా పర్యటిస్తున్న పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్....కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బేన్, గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రవికుమార్, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ సారా కార్ట్మెల్తో సమావేశం అయ్యారు.
రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్ఫోన్ల కోసం గొరిల్లా గ్లాస్ను తయారు చేసేందుకు... తెలంగాణలో తయారీ ప్లాంట్ను నెలకొల్పాలని నిర్ణయించుకుంది. ఇది ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా స్మార్ట్ పోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇది వ్యూహాత్మక పెట్టుబడి అని కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్...అమెరికాలో పర్యటిస్తున్నారు.
Happy to share that Corning, one of the world’s leaders in material sciences has decided to invest in Telangana to setup a manufacturing plant to make Gorilla Glass for smartphones, for the first time in India 😊
— KTR (@KTRBRS) September 1, 2023
Investment size of ₹934 Crore will employ 800 people but more… pic.twitter.com/baYUXByFTl
హైదరాబాద్లో ఫిబ్రవరిలో జరిగిన బయో ఆసియాలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయ్. ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ రంగంలో దిగ్గజ ఉత్పత్తి సంస్థ అయిన ఎస్జీడీ, మెటీరియల్ సైన్సులో గ్లోబల్ లీడర్ అయిన కోర్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలతో తెలంగాణ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ లో దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడితో మహబూబ్నగర్ జిల్లాలో యూనిట్ను నెలకొల్పనున్నాయి. అమెరికాకు చెందిన జూబిలెంట్ సంస్థ రూ.1,000 కోట్లు, ఫ్రాన్స్ సంస్థ సనోఫి రూ.250 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయ్.
అమెరికాకు చెందిన ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ....200 కోట్లతో తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించింది. ఇప్పటికే ఈ కంపెనీ తమ మొదటి అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థను రాష్ట్రంలో ప్రారంభించింది. గొట్టాలు, బ్యాగ్లు, బాటిళ్లు, ఫ్లాస్కులు, ప్లాస్టిక్ ల్యాబ్వేర్ వంటి వస్తులను ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రపంచ దిగ్గజ బయోటెక్నాలజీ కంపెనీ ‘జెనెసిస్’ సైతం తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో 415 కోట్లు కంపెనీ పెట్టుబడి పెట్టింది. తాజాగా మరో రూ.497 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టనుంది. తాజా విస్తరణతో మరో 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు
Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు
DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్
PGECET Seats: పీజీఈసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్కు మరోసారి ఊరట !
Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ని అరెస్ట్ చేసిన ఈడీ
/body>