అన్వేషించండి

Uthham Kumar: బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి చేయడంలో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు విఫలం - ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uthham Kumar : హైదరాబాద్ బీబీ నగర్ లోని ఎయిమ్స్ ను పూర్తి చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ అన్నారు. అలాగే టీఆర్ఎస్ కూడా దీనిపై ఏం మాట్లాడట్లేదని అన్నారు.

Uthham Kumar: హైదరాబాద్ బీబీ నగర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ని పూర్తి చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోని టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో కచ్చితమైన వైఖరి అనుసరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభలో తాను లేవనెత్తిన ఎయిమ్స్ బీబీనగర్‌కు సంబంధించిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన సమాధానంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత నాలుగేళ్లలో ఎయిమ్స్ బీబీనగర్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదని కేంద్రమంత్రి అందించిన గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు.

ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష యోజన (పీఎమ్ఎస్ఎస్ వై) కింద మంజూరైన దేశ వ్యాప్తంగా 22 కొత్త ఎయిమ్స్‌లో ఎయిమ్స్ బీబీనగర్‌ కూడా ఉందని ఆయన అన్నారు. భోపాల్ (మధ్యప్రదేశ్), భువనేశ్వర్ (ఒడిశా), జోధ్‌పూర్ (రాజస్థాన్), పాట్నా (బీహార్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) మరియు రిషికేశ్ (ఉత్తరాఖండ్)లో 6 ఎయిమ్స్ పూర్తిగా పని చేస్తుండగా.. ఎయిమ్స్ బీబీనగర్‌తో సహా మిగిలిన 16 ఎయిమ్స్ లో కార్యకలాపాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఎయిమ్స్ బీబీనగర్‌ను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని, మంజూరైన ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. ఎయిమ్స్ బీబీనగర్‌కు కేంద్ర మంత్రి వర్గం 17 డిసెంబర్ 2018న ఆమోదం తెలిపిందని మరియు ప్రాజెక్ట్ కోసం రూ.1,028 మంజూరు చేసిందని ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.31.71 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అన్నారు. ఇంకా ఈ ఆసుపత్రి పూర్తి చేయడానికి గడువు సెప్టెంబరు 2022గా నిర్ణయించిన ఇప్పుడు జనవరి 2025 వరకు పొడిగించారని మరియు ఇప్పుడు గడువుపై కేంద్రం మౌనంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

బీబీనగర్ ఎయిమ్స్ సహా దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ ఏర్పాటుపై 2019 నవంబర్ 29 మధ్య నేటి వరకు 10 సార్లు పార్లమెంటులో వివిధ ప్రశ్నలు లేవనెత్తినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్‌పై కేంద్రం ఇచ్చిన సమాధానాలు ప్రాజెక్టు, అనివార్య కారణాలతో ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందని స్పష్టం చేశారు. 2019 నవంబర్ 29న లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్రం ఎయిమ్స్ బీబీనగర్‌ను పూర్తి చేయడానికి గడువును సెప్టెంబర్ 2022గా పేర్కొంది. నాలుగు నెలల తర్వాత, అంటే, 12 ఫిబ్రవరి 2021న కేంద్ర మంత్రి పార్లమెంటుకు రూ. 1,028 కోట్లు మంజూరు అయ్యాయి. మొత్తం రూ. 22.78 కోట్లు ప్రాజెక్టుపై వెచ్చించారు. అలాగే పూర్తి చేయడానికి గడువు సెప్టెంబర్ 2022లోనే ఉంది. ఎనిమిది నెలల తర్వాత అంటే డిసెంబర్ 3 2021న, ఎయిమ్స్ బీబీనగర్‌ను పూర్తి చేయడానికి గడువును నవంబర్ 2023 వరకు పొడిగించినట్లు కేంద్రం సభకు తెలియజేసింది. ఇది కూడా రూ. 28.16 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేశారు. 2021 ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు 8 నెలల కాలంలో6 కోట్లు ఖర్చు చేశారు.

 2022ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంట్‌లో ప్రశ్న లేవనెత్తినపుడు నవంబర్ 2023గా పూర్తి చేయాలని సమాధానం తెలిపింది. నాలుగు నెలల తర్వాత, అంటే 21 జూన్ 2022వ తేదీన కేంద్రం పూర్తి చేయడానికి గడువును జనవరి 2025 వరకు పొడిగించింది. అలాగే రూ. 29.28 కోట్లను ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేశారు. ఒకటిన్నర సంవత్సరాలలో డిసెంబర్ 2021 నుండి జూన్ 2022 వరకు కోటి రూపాయలు ఖర్చు చేశారు. అలాగే గడువును 14 నెలలు పొడిగించారు. ఈరోజు తాను ఎయిమ్స్ బీబీనగర్‌ గురించి ఇదే ప్రశ్నను లేవనెత్తినప్పుడు, కేంద్ర మంత్రి ఇప్పటి వరకు రూ. 31.71 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నప్పటికీ.. గడువు గురించి ఏమీ ప్రస్తావించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కేవలం రూ. 8.93 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. మూడేళ్లుగా గడువు పొడిగిస్తూనే ఉన్నారని, దీంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించదని వివరించారు.  

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన గణాంకాలను ఉటంకిస్తూ 183 ఫ్యాకల్టీ పోస్టులుంటే 94 ఖాళీగా ఉన్నాయన్నారు. అదే విధంగా మంజూరైన 971 అధ్యాపకేతర పోస్టులు 784 ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేటాయించిన రూ.1,618 కోట్లలో బీజేపీ ప్రభుత్వం రూ.1,288.99 కోట్లు విడుదల చేసింది. కానీ తెలంగాణలోని ఎయిమ్స్‌కు రూ.31.71 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తెలంగాణ పట్ల స్వచ్ఛమైన వివక్ష, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం సవతి తల్లిగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే బాధ్యత అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లూ మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ వివక్షపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎందుకు మౌనంగా ఉన్నారని.. దాదాపు ఏడేళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రత్యర్థిగా డ్రామా ఆడుతోందన్నారు.

మోదీకి సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వివాదాస్పద చట్టాల ఆమోదం వంటి అన్ని ప్రధాన నిర్ణయాల్లోనూ ప్రభుత్వం.. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేకనే కేసీఆర్‌ మౌనంగా ఉండడంతో తెలంగాణ పేద ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందకుండా పోయిందని విమర్శించారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనించాలని, ఆ అన్యాయాలకు మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఉన్న బంధాన్ని కూడా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ త్వరలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని ఆయన ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR: కేసీఆర్ స్కీంలతో పాటు వైఎస్సార్ పథకాలను రద్దు చేస్తారా? జీవో 7పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
కేసీఆర్ స్కీంలతో పాటు వైఎస్సార్ పథకాలను రద్దు చేస్తారా? జీవో 7పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
Telangana Rains: తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Embed widget