అన్వేషించండి

Uthham Kumar: బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి చేయడంలో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు విఫలం - ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uthham Kumar : హైదరాబాద్ బీబీ నగర్ లోని ఎయిమ్స్ ను పూర్తి చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ అన్నారు. అలాగే టీఆర్ఎస్ కూడా దీనిపై ఏం మాట్లాడట్లేదని అన్నారు.

Uthham Kumar: హైదరాబాద్ బీబీ నగర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ని పూర్తి చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోని టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో కచ్చితమైన వైఖరి అనుసరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభలో తాను లేవనెత్తిన ఎయిమ్స్ బీబీనగర్‌కు సంబంధించిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన సమాధానంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత నాలుగేళ్లలో ఎయిమ్స్ బీబీనగర్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదని కేంద్రమంత్రి అందించిన గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు.

ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష యోజన (పీఎమ్ఎస్ఎస్ వై) కింద మంజూరైన దేశ వ్యాప్తంగా 22 కొత్త ఎయిమ్స్‌లో ఎయిమ్స్ బీబీనగర్‌ కూడా ఉందని ఆయన అన్నారు. భోపాల్ (మధ్యప్రదేశ్), భువనేశ్వర్ (ఒడిశా), జోధ్‌పూర్ (రాజస్థాన్), పాట్నా (బీహార్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) మరియు రిషికేశ్ (ఉత్తరాఖండ్)లో 6 ఎయిమ్స్ పూర్తిగా పని చేస్తుండగా.. ఎయిమ్స్ బీబీనగర్‌తో సహా మిగిలిన 16 ఎయిమ్స్ లో కార్యకలాపాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఎయిమ్స్ బీబీనగర్‌ను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని, మంజూరైన ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. ఎయిమ్స్ బీబీనగర్‌కు కేంద్ర మంత్రి వర్గం 17 డిసెంబర్ 2018న ఆమోదం తెలిపిందని మరియు ప్రాజెక్ట్ కోసం రూ.1,028 మంజూరు చేసిందని ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.31.71 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అన్నారు. ఇంకా ఈ ఆసుపత్రి పూర్తి చేయడానికి గడువు సెప్టెంబరు 2022గా నిర్ణయించిన ఇప్పుడు జనవరి 2025 వరకు పొడిగించారని మరియు ఇప్పుడు గడువుపై కేంద్రం మౌనంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

బీబీనగర్ ఎయిమ్స్ సహా దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ ఏర్పాటుపై 2019 నవంబర్ 29 మధ్య నేటి వరకు 10 సార్లు పార్లమెంటులో వివిధ ప్రశ్నలు లేవనెత్తినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్‌పై కేంద్రం ఇచ్చిన సమాధానాలు ప్రాజెక్టు, అనివార్య కారణాలతో ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందని స్పష్టం చేశారు. 2019 నవంబర్ 29న లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్రం ఎయిమ్స్ బీబీనగర్‌ను పూర్తి చేయడానికి గడువును సెప్టెంబర్ 2022గా పేర్కొంది. నాలుగు నెలల తర్వాత, అంటే, 12 ఫిబ్రవరి 2021న కేంద్ర మంత్రి పార్లమెంటుకు రూ. 1,028 కోట్లు మంజూరు అయ్యాయి. మొత్తం రూ. 22.78 కోట్లు ప్రాజెక్టుపై వెచ్చించారు. అలాగే పూర్తి చేయడానికి గడువు సెప్టెంబర్ 2022లోనే ఉంది. ఎనిమిది నెలల తర్వాత అంటే డిసెంబర్ 3 2021న, ఎయిమ్స్ బీబీనగర్‌ను పూర్తి చేయడానికి గడువును నవంబర్ 2023 వరకు పొడిగించినట్లు కేంద్రం సభకు తెలియజేసింది. ఇది కూడా రూ. 28.16 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేశారు. 2021 ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు 8 నెలల కాలంలో6 కోట్లు ఖర్చు చేశారు.

 2022ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంట్‌లో ప్రశ్న లేవనెత్తినపుడు నవంబర్ 2023గా పూర్తి చేయాలని సమాధానం తెలిపింది. నాలుగు నెలల తర్వాత, అంటే 21 జూన్ 2022వ తేదీన కేంద్రం పూర్తి చేయడానికి గడువును జనవరి 2025 వరకు పొడిగించింది. అలాగే రూ. 29.28 కోట్లను ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేశారు. ఒకటిన్నర సంవత్సరాలలో డిసెంబర్ 2021 నుండి జూన్ 2022 వరకు కోటి రూపాయలు ఖర్చు చేశారు. అలాగే గడువును 14 నెలలు పొడిగించారు. ఈరోజు తాను ఎయిమ్స్ బీబీనగర్‌ గురించి ఇదే ప్రశ్నను లేవనెత్తినప్పుడు, కేంద్ర మంత్రి ఇప్పటి వరకు రూ. 31.71 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నప్పటికీ.. గడువు గురించి ఏమీ ప్రస్తావించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కేవలం రూ. 8.93 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. మూడేళ్లుగా గడువు పొడిగిస్తూనే ఉన్నారని, దీంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించదని వివరించారు.  

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన గణాంకాలను ఉటంకిస్తూ 183 ఫ్యాకల్టీ పోస్టులుంటే 94 ఖాళీగా ఉన్నాయన్నారు. అదే విధంగా మంజూరైన 971 అధ్యాపకేతర పోస్టులు 784 ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేటాయించిన రూ.1,618 కోట్లలో బీజేపీ ప్రభుత్వం రూ.1,288.99 కోట్లు విడుదల చేసింది. కానీ తెలంగాణలోని ఎయిమ్స్‌కు రూ.31.71 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తెలంగాణ పట్ల స్వచ్ఛమైన వివక్ష, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం సవతి తల్లిగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే బాధ్యత అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లూ మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ వివక్షపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎందుకు మౌనంగా ఉన్నారని.. దాదాపు ఏడేళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రత్యర్థిగా డ్రామా ఆడుతోందన్నారు.

మోదీకి సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వివాదాస్పద చట్టాల ఆమోదం వంటి అన్ని ప్రధాన నిర్ణయాల్లోనూ ప్రభుత్వం.. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేకనే కేసీఆర్‌ మౌనంగా ఉండడంతో తెలంగాణ పేద ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందకుండా పోయిందని విమర్శించారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనించాలని, ఆ అన్యాయాలకు మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఉన్న బంధాన్ని కూడా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ త్వరలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని ఆయన ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol mess: పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Fuel Shortage in Telangana: తెలంగాణలో పెట్రోల్, LPG కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు: పౌరసరఫరాల శాఖ
తెలంగాణలో పెట్రోల్, LPG కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు: పౌరసరఫరాల శాఖ

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Embed widget