అన్వేషించండి

Khajaguda Lands PIL: ఖాజాగూడ భూములపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్: గత ప్రభుత్వంపై ఆరోపణలు? హైకోర్టు రియాక్షన్

Hyderabad News | శేరిలింగపల్లి మండలం ఖాజాగూడ సర్వే నెం.119..122లో ఉన్న 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని హైకోర్టులో వేసిన పిల్ లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

Congress MLAs Petition on Khajaguda Lands | హైదరాబాద్: ఖాజాగూడలో 27.18 ఎకరాల భూమి ఆక్రమణకు గురయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) దాఖలు చేశారు. ఈ పోరంబోకు భూమి విలువ 2 వేల కోట్ల నుండి 10 వేల కోట్ల వరకు ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు.

పిల్ లో పేర్కొన్న అంశాలు ఇవే:

ఈ మేరకు వారు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే శేరిలింగపల్లి మండలం ఖాజాగూడ సర్వే నెం.119..122లో ఉన్న 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని హైకోర్టులో వేసిన పిల్ లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కొందరు మున్సిపల్ అధికారులు, ఈ ప్రైవేటు బిల్డర్లతో కలిసి అక్రమంగా ఈ భూమిని బదిలీ చేశారని, అందులో నిర్మాణాలు చేపట్టేందుకు సదరు బిల్డర్లకు అనుమతులు కూడా ఇచ్చారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆక్రమణకు గురయిన భూమిలో 47 అంతస్తుల ఎనిమిది భారీ టవర్ల నిర్మాణం జరుగుతుందని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని పిల్ లో పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూమిని బదిలీ చేశారని, నిర్మాణ అనుమతులు అక్రమమని ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన పిల్ లో వివరించారు. ఈ విషయంలో HYDRAA (Hyderabad Urban Development Authority) కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిల్ లో పేర్కొన్నారు.

హైకోర్టు ఏం చెప్పిందంటే..?

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు కలిసి వేసిన పిల్ పై హైకోర్టు ప్రాథమిక విచారణ జరిపింది. పిటిషనర్లు HYDRAA కు ఇచ్చిన ఫిర్యాదులో సర్వేనంబర్లు, అవసరమైన వివరాలు లేవని గుర్తించింది. పూర్తి వివరాలతో కొత్త పిటిషన్ ను సంబంధిత అధికారులకు ఇవ్వాలని, ఆ కాపీని కోర్టుకు సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా?

1958 వరకు ఈ సర్వేలోని భూమి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత 1995 లో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) రెక్టిఫికేషన్ ఆర్డర్ ద్వారా ఇవి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై ఆ భూమిని రికార్డులు చూపడం జరిగింది. అయితే ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ యాజమాన్య హక్కులు లేని వారు, దీనిపై హైకోర్టులో అప్పీలు చేసిన వ్యక్తి మధ్య రాజీ కుదరడంతో 2017లో హైకోర్టులో కేసు ఉపసంహరించుకున్నారు. దీని వల్ల ఆ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతికి మళ్లీ వెళ్లిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాతే ఈ భూమిలో నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జరిగింది. అంటే ఈ నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే. ఇలా దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ వేయడం ద్వారా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.


About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget