అన్వేషించండి

Madhu Goud Yaskhi: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై, రైతులను మోసం చేస్తున్నారు: మధుయాష్కీ గౌడ్

గతంలో వరి వేయాలని చెప్పి.. ఇప్పుడు అన్నదాతల సమస్యలకు కారకుడు సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

Madhu Yaskhi Slams CM KCR over Paddy Procurement issue: తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం. అయితే అన్నదాతల సమస్యలకు కారకుడు సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. వరి వేయండి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని.. ప్రతి గింజా కొంటానని శాసనసభలో చెప్పి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. వరి ధాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు.

తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం తీసుకోకపోతే టీఆర్ఎస్  నాయకులు ఎక్కడ తిరగకుండా చేస్తామని, అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు లేని సమస్యలు సృష్టించి, తానే పరిష్కారం చేసినట్లు నటిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. వంద లక్షల టన్నులు ధాన్యం అవసరం అని చెప్పిన కేసీఆర్ఇప్పుడు దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారు, దరిద్రపు మాటలతో రైతులను ఇంకా మోసం చేయవద్దని సీఎం కేసీఆర్‌కు సూచించారు.  

సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు..
సిద్దిపేట జిల్లా దౌల్తబాద్ మండలం సోరంపల్లి గ్రామంలో బొల్లం అశోక్ అనే రైతు అత్మహత్య చేసుకున్నాడని, కేసీఆర్ ప్రకటనల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని చెపారు. ఖమ్మం రైతులు సూర్యాపేట వెళ్తే బ్రోకర్ లు తక్కువ ధరకు కొంటున్నారు. మీ అధికారులు, నాయకులు చేస్తున్నారు. సీఎంగా ఉండి కూడా ఏం చేయలేని నేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం నూకలు, ధాన్యం కొనను అని చెప్పింది, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకుండా మీరు కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారంటూ మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.

కేబినెట్‌లో తీర్మానం చేయండి..
తాజా కేబినెట్ భేటీలో ప్రతీ గింజా కొంటాం అని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలులో అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాం. సీబీఐ విచారణ జరపాలని ఫిర్యాదు చేస్తామని.. ఒకవేళ కేంద్రం స్పందించక పోతే కోర్టుకు వెళ్తామన్నారు. రైస్ మిల్లర్ల యజమానులు లక్షలు పెట్టీ మరీ కేసీఆర్ కుటుంబం సభ్యులకు పేపర్ లో యాడ్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రధాని కావాలన్న కల కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేశారని ఆరోపించారు.

Also Read: Telangana Cabinet: కేబినెట్‌ సమావేశం తర్వాత కేసీఆర్ కీలక ప్రకటన! బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు భారీ స్కెచ్! 

కేంద్రం తమ రాష్ట్రం రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా సైతం చేశారు. రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ ఈ దీక్షలో పాల్గొని కేసీఆర్‌కు నైతిక మద్దతు తెలిపారు. కేంద్రం రైతుల కోసం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకురావాలని, లేకపోతే దేశంలో అతిపెద్ద రైతు ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉందని కేంద్రానికి సంకేతాలు పంపారు కేసీఆర్. వరి వేయాలని రైతులను ప్రోత్సహించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీయేనని ఢిల్లీ దీక్షలో మాట్లాడుతూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను తప్పుదోవ పట్టించి, వారిని అన్యాయం చేసింది మాత్రం బీజేపీ నేతలేనని ఆరోపించారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget