అన్వేషించండి

Madhu Goud Yaskhi: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై, రైతులను మోసం చేస్తున్నారు: మధుయాష్కీ గౌడ్

గతంలో వరి వేయాలని చెప్పి.. ఇప్పుడు అన్నదాతల సమస్యలకు కారకుడు సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

Madhu Yaskhi Slams CM KCR over Paddy Procurement issue: తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం. అయితే అన్నదాతల సమస్యలకు కారకుడు సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. వరి వేయండి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని.. ప్రతి గింజా కొంటానని శాసనసభలో చెప్పి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. వరి ధాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు.

తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం తీసుకోకపోతే టీఆర్ఎస్  నాయకులు ఎక్కడ తిరగకుండా చేస్తామని, అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు లేని సమస్యలు సృష్టించి, తానే పరిష్కారం చేసినట్లు నటిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. వంద లక్షల టన్నులు ధాన్యం అవసరం అని చెప్పిన కేసీఆర్ఇప్పుడు దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారు, దరిద్రపు మాటలతో రైతులను ఇంకా మోసం చేయవద్దని సీఎం కేసీఆర్‌కు సూచించారు.  

సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు..
సిద్దిపేట జిల్లా దౌల్తబాద్ మండలం సోరంపల్లి గ్రామంలో బొల్లం అశోక్ అనే రైతు అత్మహత్య చేసుకున్నాడని, కేసీఆర్ ప్రకటనల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని చెపారు. ఖమ్మం రైతులు సూర్యాపేట వెళ్తే బ్రోకర్ లు తక్కువ ధరకు కొంటున్నారు. మీ అధికారులు, నాయకులు చేస్తున్నారు. సీఎంగా ఉండి కూడా ఏం చేయలేని నేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం నూకలు, ధాన్యం కొనను అని చెప్పింది, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకుండా మీరు కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారంటూ మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.

కేబినెట్‌లో తీర్మానం చేయండి..
తాజా కేబినెట్ భేటీలో ప్రతీ గింజా కొంటాం అని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలులో అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాం. సీబీఐ విచారణ జరపాలని ఫిర్యాదు చేస్తామని.. ఒకవేళ కేంద్రం స్పందించక పోతే కోర్టుకు వెళ్తామన్నారు. రైస్ మిల్లర్ల యజమానులు లక్షలు పెట్టీ మరీ కేసీఆర్ కుటుంబం సభ్యులకు పేపర్ లో యాడ్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రధాని కావాలన్న కల కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేశారని ఆరోపించారు.

Also Read: Telangana Cabinet: కేబినెట్‌ సమావేశం తర్వాత కేసీఆర్ కీలక ప్రకటన! బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు భారీ స్కెచ్! 

కేంద్రం తమ రాష్ట్రం రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా సైతం చేశారు. రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ ఈ దీక్షలో పాల్గొని కేసీఆర్‌కు నైతిక మద్దతు తెలిపారు. కేంద్రం రైతుల కోసం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకురావాలని, లేకపోతే దేశంలో అతిపెద్ద రైతు ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉందని కేంద్రానికి సంకేతాలు పంపారు కేసీఆర్. వరి వేయాలని రైతులను ప్రోత్సహించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీయేనని ఢిల్లీ దీక్షలో మాట్లాడుతూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను తప్పుదోవ పట్టించి, వారిని అన్యాయం చేసింది మాత్రం బీజేపీ నేతలేనని ఆరోపించారు.

టాప్ హెడ్ లైన్స్

Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget