అన్వేషించండి

Telangana Latest News: తెలంగాణలో అధికారుల సెలవులు రద్దు- ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారి- తుపానుపై సీఎం సమీక్ష

Telangana Latest News: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో అధికారులకు సెలవు రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.

Telangana CM Revanth Reddy Review On Montha Cyclone: తెలంగాణ వ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావం గట్టిగానే ఉంది. పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. జోరుగా వర్షాలు పడుతున్న టైంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం సేకరణ జరుగుతున్న టైంలో వర్షాల వల్ల ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫీల్డ్‌లో ఏం జరుగుతుందో సీఎంవోకు ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని చెప్పారు. అలా రిపోర్టు ఇవ్వకపోయిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.  

Telangana Latest News: తెలంగాణలో అధికారుల సెలవులు రద్దు- ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారి- తుపానుపై సీఎం సమీక్ష
విపత్తు టైంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరిస్తున్న టైంలో వర్షాలు పడుతున్నందున ఆటంకం లేకుండా చూడాలని సూచించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కేంద్రానికి ఒక మండల స్థాయి అధికారి నియమించాలని తెలిపారు. వర్షాలు ఎక్కువగా ఉన్న చోట ధాన్యాన్ని సమీపంలోని పంక్షన్ హాల్‌లోకి తరలించాలని చెప్పారు. ప్రతి ధాన్యం కేంద్రంలో ఏం జరుగుతుందో చెబుతూ ప్రతి రోజూ రిపోర్టు ఇవ్వాలని నిర్దేశించారు. అలా రిపోర్టు ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Telangana Latest News: తెలంగాణలో అధికారుల సెలవులు రద్దు- ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారి- తుపానుపై సీఎం సమీక్ష

క్షేత్రస్థాయిలో సమస్యలు వెంటనే తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి జిల్లా యంత్రాంగం ఒక మానిటరింగ్ సెంటర్ ేర్పాటు చేయాలని చెప్పారు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రోడ్లు పరిస్థితి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌నుడైవర్ట్ చేయాలని చెప్పారు. వాగులు వంకలు, చెరువుల పరిస్థితి తెలుసుకొని సమీపంలోని ప్రజలను అధికారులను అలర్ట్ చేయాలని ఆదేశించారు. 


Telangana Latest News: తెలంగాణలో అధికారుల సెలవులు రద్దు- ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారి- తుపానుపై సీఎం సమీక్ష

ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నారంటే... "16 జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది
దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నా అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలి. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి. వరంగల్‌లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలి. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి .జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధింత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలి. 


Telangana Latest News: తెలంగాణలో అధికారుల సెలవులు రద్దు- ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారి- తుపానుపై సీఎం సమీక్ష

ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదు. వాతావరణ పరిస్థితుల బాగోలేకపోవడంతో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నా .రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా. తుపాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది." అని చెప్పారు. 


Telangana Latest News: తెలంగాణలో అధికారుల సెలవులు రద్దు- ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారి- తుపానుపై సీఎం సమీక్ష

వరంగల్‌​లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్​, డీజీపీకి సూచించారు. హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునే చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, ఎక్కడైనా వరదలో ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీటితో పాటు​, ఫుడ్ పాకెట్లు  సరఫరా చేయాలని తెలిపారు. 

ఇప్పటికే భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్లన్నీ మునిగిపోయాయి. పంటలు నీట మునిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పూర్తిగా పాడైపోయింది. రాశులుగా పోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం మొలకెత్తింది. మరికొద్ది రోజులుల చేతికి వస్తుందని అనుకున్న పంట ఇలా నీటిపాలు కావడంపై అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వాపోతున్నారు.  


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
Affordable International Trips for Indians : ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలు ఇవే.. ఇండియన్స్​కు వారం రోజులకు అయ్యే ఖర్చు ఇదే
ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలు ఇవే.. ఇండియన్స్​కు వారం రోజులకు అయ్యే ఖర్చు ఇదే
GHMC: మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
Palash Muchhal Movie: డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా??
డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా??
Advertisement

వీడియోలు

India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్
Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
Affordable International Trips for Indians : ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలు ఇవే.. ఇండియన్స్​కు వారం రోజులకు అయ్యే ఖర్చు ఇదే
ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలు ఇవే.. ఇండియన్స్​కు వారం రోజులకు అయ్యే ఖర్చు ఇదే
GHMC: మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
Palash Muchhal Movie: డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా??
డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా??
AK47 Movie - Venkatesh & Trivikram: 'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
New Kia Seltos: మార్కెట్లోకి కొత్త Kia Seltos విడుదల.. ఫీచర్లు, ధర చూశారా! ఆ SUVలకు గట్టి పోటీ
మార్కెట్లోకి కొత్త Kia Seltos విడుదల.. ఫీచర్లు, ధర చూశారా! ఆ SUVలకు గట్టి పోటీ
Year Ender 2025: బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
Bigg Boss Telugu Day 94 Promo : తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు.. కళ్యాణ్ కీలు బొమ్మగా మారిపోయాడా?
తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు.. కళ్యాణ్ కీలు బొమ్మగా మారిపోయాడా?
Embed widget