అన్వేషించండి

CM KCR News: ప్రతిష్టాత్మకంగా అమరవీరుల స్మారక చిహ్నం - రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR News: తెలంగాణ రాష్ట్రసాధనలో అమరవీరులైన వారి  కోసం  స్మారక చిహ్నం నిర్మించారు. దీన్ని రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు.  

CM KCR News: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులైన వారి కోసం ప్రతిష్టాత్మకంగా స్మారక చిహ్నాన్ని నిర్మించారు. భారీ స్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్, పైభాగంలో ఎరుపు - పసుపు కలగలిపిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతిలో ఇది ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున, ఓ వైపు హుస్సేన్ సాగర్, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయానికి మధ్యలో దీన్ని నిర్మించారు. ఈనెల 22వ తేదీన ఈ స్మారక చిహ్నాన్ని ప్రారంభించబోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు 6 వేల మందితో అంబేడ్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ ఉంటుంది. సీఎం కేసీఆర్ 6.30 గంటలకు అమరుల స్మారకం వద్దకు చేరుకుంటారు. అమరులకు పోలీస్ గన్ సెల్యూట్ చేసిన తర్వాత అమరజ్యోతిని ప్రారంభిస్తారు. అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ 10 వేల మంది దీపాలతో అమరులకు నివాళులు అర్పిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం 800 డ్రోన్ లతో అమరులకు నివాళి, తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తారు. 

ఈ నిర్మాణానికి దాదాపుగా 180 కోట్ల వ్యయం

అయితే ఈ నిర్మాణానికి రూ.177.50 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన, అతుకులు లేని స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మితం కావడం విశేషం. 17 వందల టన్నుల స్టీల్ ను వినియోగించి నిర్మించిన ఈ నిర్మాణం పూర్తి ఆర్సీసీ రహితం. దీపం ఎత్తు 65 అడుగులు ఉంటుంది. దీనికి మొత్తం 100 టన్నుల స్టెయిన్ లెస్ స్టీలును వాడారు. అమరజ్యోతి ఎత్తు 85 అడుగులు ఉంటుంది. దీనికోసం హై డిఫైన్డ్ కార్బన్ స్టీల్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అమరజ్యోతి బంగారం, పసురు రంగులో ఇంటగా.. రెండు రకాల స్టీల్ ను జర్మనీ నుంచి తెప్పించారు. వీటిని దుబాయ్ కు చెందిన ఓ కంపెనీ అమర్చింది. ఇలాంటి నిర్మాణాలు ఇప్పటి వరకు చికాగో, దుబాయ్ లో ఉన్నా... అవి ఇక్కడి స్మారక చిహ్నంలా ఉపయోగించుకునే వసతులు లేవు.  

ఆరు అంతస్తులతో భవన నిర్మాణం..!

3.269 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం మొత్తం ఆరు అంతస్థులు. రెండు అండర్ గ్రౌండ్ కాగా, మరో నాలుగు పై అంతస్తులు. బేస్ మెంట్ - 1లో పార్కింగ్ సదుపాయం, గ్రౌండ్ ఫ్రోల్ లో ఆర్ట్ గ్యాలీ, మొదటి అంతస్తులో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, అమరుల పొటోలతో పాటు ఒక థియటర్ ఉంటుంది. రెండో అంతస్తులో 600 మంది కూర్చునేలా ఓ పెద్ద హాల్, మూడో అంతస్తు, నాలుగో అంతస్తులో ఓపెన్ రెస్టారెంట్, గ్లాస్ రూప్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఈ భవనంలోఅనేక ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. 350 కార్లు, 600 బైకులకు సరిపడా పార్కింగ్ సౌకర్యం ఉంది. భవనం నిర్మాణ వైశాల్యం (బిల్డప్ ఏరియా) 2.88 లక్షల చదరపు అడుగులు. హుస్సేన్ సాగర్ అందాలు, బుద్ధ విగ్రహం, బిర్లామందిర్, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాు వీక్షించేందుకు వీలుగా టెర్రస్ పై రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. అమరుల స్మారకం నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా ప్రస్తుతంత ఫినిషింగ్ పనులు, ప్రధాన ద్వారం, గ్రీనరీ తదితర పనులు కొనసాగుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget