అన్వేషించండి

Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Bhogapuram Airport News | శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Rammohan Naidu Launches Airport Predictive Operations Centre at Hyderabad Airport | హైదరాబాద్‌: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తుందని, మరో పదేళ్లలో దేశంలో 50 ఎయిర్ పోర్టులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. 2026 జూన్ నాటిక భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్‌‌లోని నోవాటెల్‌లో బుధవారం జరిగిన ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. 

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెనుక చంద్రబాబు కృషి

తెలంగాణలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి వెనుక ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) కృషి ఉందన్నారు రామ్మోహన్‌ నాయుడు. దాదాపు రెండు దశాబ్దాల కిందట 5 వేల ఎకరాల భూసేకరణ అంటే మామూలు విషయం కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులపై ఫోకస్ చేస్తోందన్నారు. అయితే ఇందుకు చంద్రబాబు ప్లానింగే కారణం అన్నారు. ఇంకా చెప్పాలంలే దేశంలోని ఐటీ విప్లవం (IT Revolution) వెనక టీడీపీ అధినేత చంద్రబాబు కృషి ఉందన్నారు. ఐటీ ద్వారా దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నమ్ముతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు చంద్రబాబు ఆలోచనే 

రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘దేశంలో విమానాశ్రయాల నిర్వహణలో బెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం. తాజాగా ఏఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించాను. దేశ వ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ (Digiyatra Technology) వినియోగిస్తున్నాం. ఎయిర్‌పోర్టులు అంటే కేవలం రవాణా సౌకర్యం కాదు. అది ఎందరికో ఉపాధి సైతం కల్పిస్తున్నాయి. ఎయిర్‌పోర్టులో డేటా అనలటిక్స్‌ వినియోగించి మరింత మెరుగ్గా సేవలు అందిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో విమానయాన మంత్రిత్వ శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలో మార్పులు, టెక్నాలజీ వినియోగం కారణంగా ప్రపంచ దేశాలు భారత్ వెైపు చూస్తున్నాయి. తెలంగాణలో వరంగల్ విమానాశ్రయంతో పాటు, ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం.  2026 జూన్ కల్లా భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తాం. విమానాశ్రయంలో ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించడం ఒక మైలు రాయి’ అని అన్నారు.

Also Read: Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు ! 

GMR విమానాశ్రయాల సౌత్ అండ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్‌జీకే కిషోర్ ఈ ఫీచర్ గురించి మాట్లాడుతూ.. మా కొత్త AI-ఎనేబుల్డ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్, ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ (APOC) పనులను ఆధునీకరించడంలో, ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందిస్తుంది. రియల్ టైమ్ డేటా విశ్లేషణ, ప్యాసింజర్స్ వెయిటింగ్ టైమ్ తగ్గించనున్నాం. మెరుగైన భద్రతా సేవలు లభిస్తాయి. భారత్‌లో 73 శాతం ఈ-కామర్స్, టెక్ స్టార్టప్‌లు AI, వెబ్ 3.0 అప్లికేషన్‌ల ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారని నివేదిక వచ్చిందని తెలిపారు.

Also Read: Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget