అన్వేషించండి

Telangana News : ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR Comments On Operations Musi: మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్టడీ చేసిందన్నారు కేటీఆర్. పేదల ఇళ్లు పోతాయని కేసీఆర్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని తెలిపారు

Hyderabad News: మూసీ బ్యూటిఫికేషన్, హైడ్రా దూకుడుపై పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హైడ్రా, మూసీ బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన ఉద్యమకార్యాచరణపై చర్చించారు. 

పార్టీ నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్‌లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రణాళిక లేకుండా పేదలకు ఎవరూ అండగా లేరన్నట్లుగా దూకుడుగా వెళ్తోందని విమర్శిచారు.  

నోట్ల రద్దు చేసినప్పుడు మోడీ ఏ విధంగా రకరకాల కారణాలు చెప్పారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్దతిలో ప్రజలను మోసం చేస్తుందన్నారు కేటీఆర్. ఒక రోజు మూసీ సుందరీకరణ అంటారని... ఒక రోజు నల్గొండకు నీళ్లు అని, మరో రోజు రూ. లక్షా 50 వేల కోట్లు ఎక్కడివి అని డీపీఆర్ లేనే లేదంటూ రోజుకో మాటమాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మూసీ చుట్టుపక్కల నిర్మించుకున్న ఇళ్లకు ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితమే పర్మిషన్లు ఇచ్చిందని ఇప్పుడు కూల్చడం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.  కూలగొడతామని దుందుడుకుగా పోతామంటే కుదరదని అన్నారు. హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఒక భయానక వాతావారణాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైడ్రాను పెద్ద, పెద్ద బిల్డర్లను బెదిరించేందుకే ఉపయోగిస్తున్నారని తాము నమ్ముతున్నామన్నారు కేటీఆర్. మూసీ పేరిట ఏ విధంగా లూటీ చేస్తున్నారో ప్రజల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. మూసీకి సంబంధించి 100 శాతం మురుగు నీటి శుద్ది ప్లాంట్లను రూ. 4 వేల కోట్లతో తాము నిర్మించామని తెలిపారు. 

మూసీ శుద్ది చేశామన్న కేటీఆర్‌... నల్గొండ జిల్లాకు శుద్ది చేసిన నీళ్లే వెళ్తాయన్నారు. దాని కోసం కొత్తగా ఖర్చు పెట్టాల్సిన పని లేదని చెప్పారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట్‌కు నీళ్లు తెచ్చేందుకు 11 వందల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

అన్నీ పట్టించుకోకుండా నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు ఇష్టం లేదా అంటూ ముఖ్యమంత్రి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. గతంలోనే మూసీ సుందరీకరణ చేపట్టాలని సుధీర్ రెడ్డి ఛైర్మన్‌గా ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. అప్పుడే గరీబోళ్లకు అన్యాయం జరిగితే ఆ ప్రాజెక్ట్ వద్దని కేసీఆర్ చెప్పారని తెలిపారు. మానవీయ ముఖ్యమంత్రి ఉంటే ఆ విధంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. 

 

ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా బీఆర్‌ఎస్ నాయకులు ఉంటారని తెలిపారు కేటీఆర్. తాము నిర్మించిన అన్ని ఎస్టీపీలను కూడా పర్యటిస్తామన్నారు. మా ఫామ్‌ హౌస్‌లు చట్ట విరుద్దంగా ఉంటే కూల్చేయాలన్నారు కేటీఆర్. వాటిని కూలగొడితే రేవంత్‌కు ఆనందం కలుగుతుందంటే ఆ పని చేయాలన్నారు. అంతే కానీ పేద ప్రజల జోలికి మాత్రం వెళ్లొద్దని హితవు పలికారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
Jammu Kashmir CM: జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Amaravati Works : అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
Jammu Kashmir CM: జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Amaravati Works : అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
Revanth Reddy : ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
Akhanda 2: అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!
అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!
T Series Mythri Movie Makers: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!
‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!
Embed widget