అన్వేషించండి

KTR News: కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు, వెంటనే ఎస్పీకి ఫోన్ కొట్టిన బీఆర్ఎస్ నేత

Industrial corridor notification in Vikarabad District | వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా భూ బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని, న్యాయ పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల భూసేకరణ బాధితులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ని తెలంగాణ భవన్లో కలిసి, తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తనను కలిసిన ఫార్మా సిటీ భూ సేకరణ బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 

లగచర్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం
లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ వారికి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన భూసేకరణ బాధితులపై అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ భేషరతుగా వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసుల ద్వారా బాధిత కుటుంబాలను వేధించడం మానుకోవాలన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం తగదన్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన మాట్లాడిన కేటీఆర్, బాధితులపై పెట్టిన అక్రమ కేసుల పేరుతో పోలీసు వేధింపులను నిలిపివేయాలని కోరారు.

అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల అంశం లేవనెత్తనున్న బీఆర్ఎస్

అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల భూ సేకరణ బాధితుల డిమాండ్లను లేవనెత్తుతామని కేటీఆర్ తెలిపారు. భూముల కోసం న్యాయమైన పోరాటం చేస్తున్న బాధితులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. గిరిజనులు, పేద రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ బాధితుల తరఫున నిలబడుతుందని స్పష్టం చేశారు. లగచర్ల బాధితులు చేసిన పోరాటంకు తలవంచి ప్రభుత్వం దిగి వచ్చిందని, నోటిఫికేషన్ రద్దు చేసుకుందన్నారు. కానీ మరోసారి అవే భూములను పారిశ్రామిక కారిడార్ (Industrial Corridor) పేరుతో సేకరించడం మానుకోవాలని, నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఇకనైనా నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన భూములను వదిలి, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను సేకరించి ఫార్మా పరిశ్రమల కోసం ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. గిరిజనుల భూములు గుంజుకోవడం రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గానికి నిదర్శనమని మండిపడ్డారు. జైల్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వంటి వారి తరపున, అక్రమంగా కేసులతో జైల్లో ఉన్న బాధితుల తరఫున, న్యాయపోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.

Also Read: Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్ 

తెలంగాణ ప్రభుత్వం లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూముల సేకరణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో లగచర్లకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై ప్లాన్ ప్రకారం దాడి జరిగింది. వారి వాహనాలపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని, మరికొందర్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. రైతులు ధర్నాలు, ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఫార్మా సిటీ నోటిఫికేషన్ రద్దు చేసింది. అక్కడ ఇండస్ట్రీయల్ కారిడార్ వస్తుందని, ఫార్మా సిటీ కాదని మరో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంతో రైతుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget