అన్వేషించండి

MLC Kavitha Sensational Comments: అది భూ భారతి కాదు భూ హారతి, అది తిరోగమన చర్య - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Bhu Bharati Bill | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణిలో లోపాలు లేకున్నా ఆరోపణలు చేశారని, కేసీఆర్ భూ సమస్యలు తొలగించారని అన్నారు.

BRS MLC Kavitha About Bhu Bharati Bill | హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కోసం తీసుకొచ్చిన భూభారతి చట్టం, భూ హారతి అవుతుందని భూభారతి బిల్లుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూమోసాలు పోయాయి. తెలంగాణ రైతుకు రక్షణ కవచం ధరణి. అలాంటి ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదు. రాష్ట్ర ప్రజలు, రైతులు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారని నమ్మకం ఉంది. 


భూభారతి ఒక తిరోగమన చర్య
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఒక తిరోగమన చర్య. ఆ చట్టం కచ్చితంగా భూహారతి  అయ్యేటట్లు కనిపిస్తుంది. ఆ భూ మాత పోర్టల్ భవిష్యత్తులో భూమేతకే దారి తీస్తుంది. బీఆర్ఎస్ (BRS) అంటే భూ రక్షణ సమితి అని రైతులు, ప్రజలు భావిస్తున్నారు. భూమి కోసం ప్రాణమిచ్చేది ఒకరు సైనికుడు అయితే, మరొకరు రైతు. ధరణిలో ఏమైనా సమస్యలు కనిపిస్తే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లాలి. కానీ ఆ వ్యవస్థనే రద్దు చేయడం సరికాదు. ధరణిలో కుట్ర జరిగిందని ప్రభుత్వం చెప్పడం దారుణం. 

తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నారు. మరో 17.8 లక్షల ఎకరాల భూమి వివాదాల్లో ఉంది. గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20 నుంచి 25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టు తిరగాల్సి వచ్చేది. కేసీఆర్ రైతుకు మాత్రమే భూమి యాజమాన్య హక్కు ఉండేలా చేశారు. రైతుల భూమికి భద్రత కల్పించింది కేసీఆర్. ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. 100 రోజుల్లో దాదాపు 35749 ఉద్యోగులు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళణ చేశారు. అనంతరం భూమి వివరాలను ధరణిలో ఎక్కించారు. ధరణి కన్నా ముందు చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేది.

Also Read: Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన

బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో ప్రభుత్వ భూములను కాపాడింది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదు. భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు చేరువ చేసింది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి చేయడం వల్ల పని 42 నిమిషాల్లో పూర్తయ్యేది. భూ రికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగి, రాష్ట్ర సంపద పెరిగింది. మ్యాన్యువల్ పహాణీల వల్ల పలు వివాదాలు ఏర్పడేవి. ధరణి పోర్టల్ ఆ సమస్యను తీర్చింది.
భూరికార్డులు, యాజమానుల పేర్లు స్పష్టంగా ఉండడం వల్ల రైతులకు రైతు బంధు అందింది. దాదాపు 66 లక్షల మందికి రైతులకు రైతు బంధు అందించాం.

గతంలో పంట రుణాలు వచ్చేవి కావు. ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంటలకు లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తి కల్పించాం. ధరణి పోర్టల్ ముందు లక్షలాది మంది ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యారు. భూదాన్, అటవీ, ప్రభుత్వం భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్ బీ లో చేర్చాం. ఎంజాయ్ మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెబుతుంది. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే ఎంజాయ్ మెంట్ సర్వే తేనెతుట్టెను కదిలించొద్దు. 

మళ్లీ 32 కాలమ్ లతో పహాణీలను రాయడం మొదలుపెడితే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది. రైతుల మధ్య వివాదాలు తలెత్తి కేసుల భారం, ఆర్థిక భారం అవుతుంది. ఒకే సారి కాకుండా... దశల వారీగా రీసర్వే  చేయాలి. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్ బుక్ లు ఉన్నాకా... భూధార్ కార్డు అవసర ఏంటి ?
ఖాతా నెంబరు ఉన్న తర్వాత భూదార్ నెంబరు ఎందుకన్నది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వ
హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారంలో ఉంది. భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదు. భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనపై వెనక్కి తగ్గాలి. కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Also Read: Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jayalalithaa Residence: హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!
హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
Hyderabad Old Age Homes: హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
US Iran War Updates: హర్మూజ్ జలసంధిపై వెనక్కి తగ్గుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ముందు అమెరికా ఆటలు సాగలేదా ?
హర్మూజ్ జలసంధిపై వెనక్కి తగ్గుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ముందు అమెరికా ఆటలు సాగలేదా ?
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Tirumala Vasanthotsavam 2026: శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
Harudu Movie Release Date: పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
Embed widget