అన్వేషించండి

రాజకీయ ఒత్తిడితోనే ఈడీ ప్రశ్నిస్తోందని కవిత ఆరోపణ- నేడు మరోసారి విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం (మార్చి 21) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)  రెండోసారి సుదీర్ఘంగా విచారించింది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుమారు 11 గంటల పాటు విచారించారు. మార్చి 20 ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది.  

తనను 11 గంటలు ప్రశ్నించిన అధికారులు కేవలం 14 ప్రశ్నల చుట్టే తిరుగుతున్నారని కవిత ఆరోపిస్తున్నట్టు సమాచారం. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ కుట్ర జరుగుతోందన్నారు. సహాయ నిరాకరణ చేస్తున్నాను అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్న అనుమానం పడ్డారామె. ఇప్పటివరకు ఎవ్వరితో కూడా కన్ఫ్రంట్ చేయలేదన్నారు. 

కేసులో తన పాత్ర ఉందని ఒక్క ఆధారాన్ని కూడా ఈడీ అధికారులు చూపించలేదని కవిత అన్నట్టు తెలుస్తోంది. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారిస్తున్నట్టు బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇది కేవలం రాజకీయ కుట్ర అని అన్నారు. రాజకీయ ఒత్తిడితో ఈడి పారదర్శకత లోపించిందని ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత. ఓ సందర్భంలో ఈడీ అధికారులపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారని కూడా చెబుతున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నీళ్లు నమిలారని అంటున్నారు. కేవలం పొలిటికల్ లైన్ లో ప్రశ్నించినట్టు ఆరోపిస్తున్నారు. నన్ను నిందితురాలుగా పిలిచారా అని ఈడి ఆఫీసర్లను ప్రశ్నిస్తే... కాదు అని తడబడ్డారని చెప్పారు. 

ప్రశ్నించడానికి పిలిచి ఎలాంటి కన్ఫ్రంటేషన్ చేయకుండా పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో విచారణ జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. తాను విచారణకు సంపూర్ణగా సహకరిస్తున్నానని నొక్కిచెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అధికారులకు స్పష్టం చేశారట. తను ఫోను ధ్వంసం చేసినట్టు మీడియాకి లీకులు ఎవరు ఇచ్చారని కూడా ఈడి అధికారులను నిలదీశారని చెప్పారు. బిజెపిలో చేరగానే మరుగునపడ్డ కేసుల గురించి ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. బీజేపీలో చేరాక మరుగున పడ్డ హిమంతా బిశ్వ శర్మ, సుజనా చౌదరి, నారాయణరాణే కేసులను ప్రస్తావించినట్టు సమాచారం. తాను ఈడి కార్యాలయానికి చేరుకున్న గంట వరకు అధికారులు రాలేదన్నారు. గంటలపాటు రూమ్‌లో ఒకరిని కూర్చోబెట్టి మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఈడి అధికారుల విచారణలో పారదర్శకత లేదన్నారు కవిత. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం (మార్చి 21) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు. నిన్న ఆమెను ఈడీ అధికారులు 10 గంటలకుపైగా విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార లావాదేవీలు, లిక్కర్ స్కా్మ్ లో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. వైద్యులు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపిస్తూ వెళ్లిపోయారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Pak Asia Cup 2025: బుమ్రా, అఫ్రిది కాదు.. భారత్-పాక్ మ్యాచులో టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీరే
బుమ్రా, అఫ్రిది కాదు.. భారత్-పాక్ మ్యాచులో టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీరే
Tirumala VIP Break Darshans: సెప్టెంబర్ 16న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం- వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
సెప్టెంబర్ 16న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం- వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Thurakapalem Deaths Mystery: తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ- యురేనియం అవశేషాలు గుర్తింపు, చెన్నైలో నిర్ధారణ
తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ- నీటిలో యురేనియం అవశేషాలు గుర్తింపు
Nitin Gadkari: ‘నా మెదడు విలువ నెలకు రూ. 200 కోట్లు’.. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
‘నా మెదడు విలువ నెలకు రూ. 200 కోట్లు’.. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

BCCI స్పెషల్ ప్లాన్? INDvsPak మ్యాచ్ క్యాన్సిల్!
బాంగ్లాదేశ్ పై శ్రీలంక సూపర్ విక్టరీ.. ఇలా అయితే ఇండియాకి కష్టమే!
Diella World's First AI Minister | అవినీతిని నిర్మూలన కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ ను నమ్ముకున్న ఆల్బేనియా | ABP Desam
ENG vs SA | ఇండియా రికార్డ్ బద్దలు కొట్టిన ఇంగ్లండ్ | ABP Desam
IND vs PAK | బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స్‌లు కొడతాడంటే డకౌట్ అయిన అయుబ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Pak Asia Cup 2025: బుమ్రా, అఫ్రిది కాదు.. భారత్-పాక్ మ్యాచులో టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీరే
బుమ్రా, అఫ్రిది కాదు.. భారత్-పాక్ మ్యాచులో టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీరే
Tirumala VIP Break Darshans: సెప్టెంబర్ 16న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం- వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
సెప్టెంబర్ 16న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం- వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Thurakapalem Deaths Mystery: తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ- యురేనియం అవశేషాలు గుర్తింపు, చెన్నైలో నిర్ధారణ
తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ- నీటిలో యురేనియం అవశేషాలు గుర్తింపు
Nitin Gadkari: ‘నా మెదడు విలువ నెలకు రూ. 200 కోట్లు’.. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
‘నా మెదడు విలువ నెలకు రూ. 200 కోట్లు’.. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
OG Surprise : పవన్ 'ఓజీ'లో డీజే టిల్లు బ్యూటీ - రాధికా కన్ఫర్మ్ చేసేసింది
పవన్ 'ఓజీ'లో డీజే టిల్లు బ్యూటీ - రాధికా కన్ఫర్మ్ చేసేసింది
Addanki Dayakar: కేటీఆర్‌కు ఆరోజు మ‌గ‌త‌నం, ద‌మ్ములేదా..?  అందుకే ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించ‌లేదా?  అద్దంకి దయాకర్ ఫైర్
కేటీఆర్‌కు ఆరోజు మ‌గ‌త‌నం, ద‌మ్ములేదా? అందుకే వారితో రాజీనామా చేయించ‌లేదా?
Ind vs Pak Asia Cup 2025: పాకిస్తాన్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌ చేయాలా అని టీమిండియా డ్రెస్సింగ్ రూంలో హాట్ డిస్కషన్
పాకిస్తాన్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌ చేయాలా అని టీమిండియా డ్రెస్సింగ్ రూంలో హాట్ డిస్కషన్
Chiru Bobby Movie: చిరంజీవి - బాబీ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా Mirai డైరెక్టర్...
చిరంజీవి - బాబీ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా Mirai డైరెక్టర్...
Embed widget