అన్వేషించండి

రాజకీయ ఒత్తిడితోనే ఈడీ ప్రశ్నిస్తోందని కవిత ఆరోపణ- నేడు మరోసారి విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం (మార్చి 21) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)  రెండోసారి సుదీర్ఘంగా విచారించింది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుమారు 11 గంటల పాటు విచారించారు. మార్చి 20 ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది.  

తనను 11 గంటలు ప్రశ్నించిన అధికారులు కేవలం 14 ప్రశ్నల చుట్టే తిరుగుతున్నారని కవిత ఆరోపిస్తున్నట్టు సమాచారం. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ కుట్ర జరుగుతోందన్నారు. సహాయ నిరాకరణ చేస్తున్నాను అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్న అనుమానం పడ్డారామె. ఇప్పటివరకు ఎవ్వరితో కూడా కన్ఫ్రంట్ చేయలేదన్నారు. 

కేసులో తన పాత్ర ఉందని ఒక్క ఆధారాన్ని కూడా ఈడీ అధికారులు చూపించలేదని కవిత అన్నట్టు తెలుస్తోంది. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారిస్తున్నట్టు బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇది కేవలం రాజకీయ కుట్ర అని అన్నారు. రాజకీయ ఒత్తిడితో ఈడి పారదర్శకత లోపించిందని ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత. ఓ సందర్భంలో ఈడీ అధికారులపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారని కూడా చెబుతున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నీళ్లు నమిలారని అంటున్నారు. కేవలం పొలిటికల్ లైన్ లో ప్రశ్నించినట్టు ఆరోపిస్తున్నారు. నన్ను నిందితురాలుగా పిలిచారా అని ఈడి ఆఫీసర్లను ప్రశ్నిస్తే... కాదు అని తడబడ్డారని చెప్పారు. 

ప్రశ్నించడానికి పిలిచి ఎలాంటి కన్ఫ్రంటేషన్ చేయకుండా పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో విచారణ జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. తాను విచారణకు సంపూర్ణగా సహకరిస్తున్నానని నొక్కిచెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అధికారులకు స్పష్టం చేశారట. తను ఫోను ధ్వంసం చేసినట్టు మీడియాకి లీకులు ఎవరు ఇచ్చారని కూడా ఈడి అధికారులను నిలదీశారని చెప్పారు. బిజెపిలో చేరగానే మరుగునపడ్డ కేసుల గురించి ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. బీజేపీలో చేరాక మరుగున పడ్డ హిమంతా బిశ్వ శర్మ, సుజనా చౌదరి, నారాయణరాణే కేసులను ప్రస్తావించినట్టు సమాచారం. తాను ఈడి కార్యాలయానికి చేరుకున్న గంట వరకు అధికారులు రాలేదన్నారు. గంటలపాటు రూమ్‌లో ఒకరిని కూర్చోబెట్టి మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఈడి అధికారుల విచారణలో పారదర్శకత లేదన్నారు కవిత. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం (మార్చి 21) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు. నిన్న ఆమెను ఈడీ అధికారులు 10 గంటలకుపైగా విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార లావాదేవీలు, లిక్కర్ స్కా్మ్ లో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. వైద్యులు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపిస్తూ వెళ్లిపోయారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK vs MI: ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK vs MI: ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
Sikandar Trailer: కండలవీరుడు సల్మాన్ ఖాన్ యాక్షన్ గూస్ బంప్స్ - 'సికిందర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది
కండలవీరుడు సల్మాన్ ఖాన్ యాక్షన్ గూస్ బంప్స్ - 'సికిందర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Embed widget