అన్వేషించండి

Harish Rao: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్న మాజీ మంత్రి

Telangana News | కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నాణ్యతా లోపం ఆరోపణలతో ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు.

kaleshwaram commission | హైదరాబాద్: తనకు చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాళేశ్వరం మీద ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట సోమవారం నాడు విచారణకు హాజరయ్యారు. 

న్యాయవ్యవస్థ, చట్టాల మీద గౌరవం ఉంది

అంతకుముందు సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అయిన తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నేటి ఉదయం కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేదు. మా పాలనలో ఉన్నంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తాం. బీఆర్ఎస్ పార్టీకి న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉంది. అందుకే నోటీసులు రాగానే కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతున్నాం. 

రైతుల కోసం కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం..

కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషపూరితంగా వ్యవహరించకూడదు. రాష్ట్ర రైతుల కోసం కేసీఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా వేలాది ఎకరాలను సాగునీరు అందించాం. దాంతో వేలాది బంజరు భూములు, బీడు భూములను రైతులు సాగు చేసి పంటలు పండించారు. ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి, దాని ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాం’ అన్నారు హరీష్ రావు.

తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు కాళేశ్వరం కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. వీరు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులలో వారికి కమిషన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో జూన్ 5న అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తనకు తెలిసిన విషయాలను కమిషన్ కు వెల్లడించానన్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని చెప్పిన ఈటల.. కాళేశ్వరం ప్రాజెక్టులో తన పాత్ర పరిమితమేనని చెప్పారు. 

ప్రాజెక్టు, సాగునీటిపారుదల శాఖకు సంబంధించిన విషయం కాగా.. అవసరమైన నిధులను ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే ఆర్థిక శాఖపై ఉంటుందన్నారు. అధికారులు, ఇంజినీర్లు, నిపుణుల రిపోర్ట్ వచ్చాక మంత్రుల సబ్ కమిటీ దీనిపై చర్చించింది. తుది నివేదికను మంత్రివర్గం మొత్తం ఆమోదించిన తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసినట్లు ఈటల తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
KTR Fires On Revanth Reddy:
"యువకులు ఆ*త్మహత్యలు చేసుకుంటున్నారు, జాబ్‌క్యాలెండర్‌ ఏమైంది?" ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget