Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇదీ, సమగ్ర వివరాలతో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సమగ్ర వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే డాక్యమెంట్ రూపంలో విషయాలు పొందుపరిచామన్నారు.

Kaleshwaram Project | హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇది తెలంగాణకు జీవధార అని, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి పార్టీ విషయాలు, రాజకీయాలు లేవని ఇది ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే..
3 బ్యారేజీలు,
15 రిజర్వాయర్లు,
19 సబ్ స్టేషన్ లు,
21 పంప్ హౌజులు,
203 కి.మీ సొరంగాలు,
1531 కి.మీ గ్రావిటి కెనాల్,
98 కి.మీ ప్రెజర్ మెయిన్స్,
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,
530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ,
240 టిఎంసీల నీళ్ల ఉపయోగం
మొత్తం మూడు బ్యారేజీలు నిర్మించగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగాయి. 85 పియర్స్ ఉన్నాయి. సుందిళ్ల బ్యారేజీలో 74 పియర్స్ ఉన్నాయి. అన్నారం బ్యారేజీలో 64 పియర్స్ ఉన్నాయి. అన్నారం, సుందిళ్లలో అన్ని బాగున్నాయి. మేడిగడ్డలో 5 పియర్స్ లో 2 పిల్లర్లు కుంగాయి. కేవలం అదొక్కటి చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు పనిఅయిపోయిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. మేడిగడ్డలో 7 బ్లాకులున్నాయి. ఏదైతే బ్లాక్లో పియర్స్ ప్రాబ్లం ఉంటే వాటిని రిపేర్ చేపిస్తే సరిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు






















