అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్

Telangana Legislative Council | కేంద్ర ప్రభుత్వం ఇదివరకే చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణలో ఎమ్మెల్యే సీటు తగ్గి, శాసనమండలి రద్దయ్యే అవకాశం ఉందని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

Boianapalli Vinod Kumar Comments on Telangana Legislative Council | హైదరాబాద్‌: ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఇది ప్రజాస్వామ్యమా? సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలకు కట్టుబడకుండా.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాజీనామా చేయించకుండా కాంగ్రెస్ (Congress Party) లో చేర్చుకుంటున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ బోయినలపల్లి వినోద్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనమండలి ఉనికి ప్రమదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే రాష్ట్ర శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేలా చేస్తేనే, రాష్ట్రంలో శాసనమండలి ఉంటుందని సూచించారు. జులై 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి కానున్న తరుణంలో వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

మండలిలో 40 సీట్లు ఉండాలి.. 
తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171 పకారం తెలంగాణ శాసన మండలిలో కనీసం సీట్లు 40 ఉండాలన్నారు. శాసనసభ సీట్లలో మూడో వంతు కౌన్సిల్‌ సభ్యులు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంత కంటే తక్కువ సీట్లు ఉండకూడదు అన్నారు. కేంద్రం ప్రభుత్వం గత ఐదేళ్ల హయాంలో చేసిన రాజ్యాంగ సవరణతో పస్తుతం తెలంగాణ శాసన మండలి ఉనికి పమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉండే ఆంగ్లో ఇండియన్‌ (Anglo Indian) ఎమ్మెల్యేను తొలగించారు. దాంతో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 120 నుంచి 119కి తగ్గిందన్నారు. 

గత అసెంబ్లీ కాలం ముగిసే వరకు ఆంగ్లో ఇండియన్‌ పదవీ కాలం ఉంది. దాంతో గత అసెంబ్లీ సమయం ముగిసే వరకు శాసనమండలికి ఎలాంటి ముప్పు రాలేదని వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో చేసిన రాజ్యాంగ సవరణ కొత్త ప్రభుత్వం, కొత్త అసెంబ్లీ ఏర్పాటు నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. దానివల్ల ఆంగ్లో ఇండియన్‌ శాసనసభ్యుడు అసెంబ్లీలో లేరు. ఫలితంగా తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 119కి పడిపోయిందని, ఎమ్మెల్యే సంఖ్య ప్రకారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి కౌన్సిల్‌ సభ్యుల సంఖ్య 1/3 కి అంటే 39కి పడిపోయినట్లు వినోద్ కుమార్ చెప్పారు. 

రాజ్యాంగం ప్రకారం కనీసం తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉండాలనే నిబంధన ఉల్లఘించినట్లు అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయం లేవనెత్తి ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే వెంటనే శాసన మండలి రద్దు అయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో శాసనమండలి ఉనికి ప్రమాదంలో పడుతుందన్నారు. రాష్ట్రంలో శాసన మండలి కొనసాగాలంటే ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలన్నారు. 

కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని, శనివారం నాటి ఇద్దరు సీఎంలు కలిసి తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. విభజన చట్టంలోని 26 సెక్షన్‌ ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 153కి, ఏపీలో అసెంబ్లీ సీట్లను 225కు పెంచాల్సి ఉందన్నారు. అసెంబ్లీ సీట్లను పునర్ విభజన చేయాలని కోరితే కేంద్రం స్పందించలేదని ఆరోపించారు.

అదే సమయంలో జమ్ము కశ్మీర్‌ లో అసెంబ్లీ సీట్లను పెంచారని, అంటే కేంద్రానికి ఇష్టం ఉంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలను పెంచుకుంటుందని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించి.. విభజన చట్టంలో పేర్కొన్న తీరుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య పెరిగేలా చూస్తేనే.. శాసన మండలి కొనసాగుతుందన్నారు. పార్లమెంట్‌లో బిల్లు వచ్చిన రోజు శాసనమండలి అవసరమమనితాను సుదీర్ఘంగా ప్రసంగించినట్లు పేర్కొన్నారు.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Akhanda 2 First Song: 'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
Ind vs SA 1st test score: బుమ్రా పేస్‌కు దక్షిణాఫ్రికా విలవిల.. మెరిసిన కుల్దీప్, సిరాజ్.. తక్కువ స్కోరుకు సఫారీలు ఆలౌట్
బుమ్రా పేస్‌కు దక్షిణాఫ్రికా విలవిల.. మెరిసిన కుల్దీప్, సిరాజ్.. తక్కువ స్కోరుకు సఫారీలు ఆలౌట్
Rahul Ravindran: మగవాళ్ళు షర్ట్‌లు విప్పితే తప్పు లేదా? చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ రవీంద్రన్ సపోర్ట్‌
మగవాళ్ళు షర్ట్‌లు విప్పితే తప్పు లేదా? చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ రవీంద్రన్ సపోర్ట్‌
Embed widget