అన్వేషించండి

Telangana : అమృత్ పథకం నిధులకు రేవంత్ సర్కారు టెండర్- సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ

Revanth Reddy: అమృత్ పథకం నిధులు సహా ఏడు నెలల్లో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి విచారణకు సిద్ధపడాలని సవాల్ చేసింది బీజేపీ. సొంత కుటుంబ సభ్యులతోపాటు మెగా సంస్థలకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

BJP Vs Congress About Amrit Scheme Funds: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం ద్వారా వచ్చిన నిధులకు రేవంత్ రెడ్డి సర్కారు టెండర్ వేసిందని అక్రమంగా నిధులు కాజేసే పనిలో బిజీగా ఉందని బీజేపీ నేతల సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియాతో మాట్లాడిన బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన 3 వేల కోట్ల రూపాయల నిధులనుదారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. శోధ, గజా, కేఎన్‌ఆర్‌ కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారని అన్నారు. రేవంత్ బావమరిది సుజన్ 400 కోట్ల రూపాయల పనులు చేస్తున్నారని ఆరోపించారు.  

Also Read: రాజకీయ నేతలు, ఐటీ కట్టే వాళ్లకు రుణమాఫీ లేనట్లే- వాళ్ల విషయంలో మాత్రం కాస్త కనికరం- మార్గదర్శకాలు ఎప్పుడంటే?

ఈ పనుల్లోనే మెగా కృష్ణారెడ్డికి 11 వందల కోట్ల రూపాయల పనులు అప్పగించారని అన్నారు మహేశ్వర్ రెడ్డి. ఎస్టిమెట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకొన్నారని ఆరోపించారు. 600 కోట్లతో అయ్యే పనికి వెయ్యి కోట్ల రూపాయలుగా ఎస్టిమెట్లు తయారు చేశారని విమర్శించారు. కాంట్రాక్టర్లు 30 నుంచి 35 శాతం లెస్ వేసి కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చని కానీ ఇలా జరగం వెనుక భారీ కుంభకోణం ఉందని అనుమానం ‌వ్యక్తం చేశారు. 

ఇన్ని పనులు అప్పగించిన ప్రభుత్వం ఒక్క జీవో పబ్లిక్ డొమైన్ పెట్టడం లేదని అన్నారు మహేశ్వర్ రెడ్డి. టెండర్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేశారని దుమ్మెత్తి పోశారు. 

Also Read: హిమాన్షు మేజర్ కాగానే 36 ఎకరాలు రిజిస్ట్రేషన్, కేటీఆర్ అక్రమాస్తులకు అవే సాక్ష్యాలు: కేకే మహేందర్ రెడ్డి

ఈ పనుల విషయంలో రేవంత్ రెడ్డి తమ్ముడు, బావమరిది ఇన్వాల్వ్‌ అయ్యారన్నారు మహేశ్వర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక వైపు జ్యుడిషియల్ విచారణ జరుగుతుంటే అదే మెగా కృష్ణారెడ్డికి 11 వందల కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. 

ఏడు నెలల్లో చేసిన చీకటి ఒప్పందాలకు, టెండర్లకు ప్రభుత్వం సిద్ధపడుతుందా అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. హెట్రో డ్రగ్స్ భూమి విషయంలోనూ, సివిల్ సప్లై అవినీతిపై విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. కొడంగల్ ప్రాజెక్టును కూడా మెగా కృష్ణారెడ్డి కే అప్పగించబోతున్నారని అన్నారు. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధుల దుర్వినియోగం పై సీబీఐ, ఈడీ విచారణ చేయాలని కోరుతామని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget