అన్వేషించండి

మత్తు ఇవ్వకుండా ఆపరేషన్లా? ప్రాణాలు ముఖ్యమా? రికార్డులు ముఖ్యమా?: బండి సంజయ్‌

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఇంత చిన్న ఆపరేషన్ వికటించి నలుగురు చనిపోవడం బాధాకరం అన్నారు.

ఈనెల 25న ఇబ్రహీంపట్నంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మొత్తం 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగినాయ్. దురద్రుష్టవశాత్తు నలుగురు చనిపోయారు. మరో 30 మంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ ఆపరేషన్ (ల్యాప్రోస్కోపిక్) చాలా చిన్నదని.. 5 నిమిషాల్లోపు జరిగే ఆపరేషన్‌కు నలుగురు చనిపోవడంతోపాటు మిగిలిన వారందరికీ ఇన్ఫెక్షన్ కావడం కలచివేసిందని అభిప్రాయపడ్డారు. ఇది చాలా పెద్ద ఘటన దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి ఇదే నిదర్శనం అన్నారు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కేసీఆర్ సర్కార్ చేసిన హత్యలేనని తెలిపారు. 

మత్తు మందు ఇవ్వకుండానే ఆపరేషన్లు..!

ఆసుపత్రికి వెళితే చికిత్స పొందుతున్న బాలింతలు ఏడుస్తున్నారని.. వాళ్లందరికీ చిన్న చిన్న పిల్లలున్నారని తెలిపారు. వాళ్ల భవిష్యత్తు ఏంటో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ‘‘ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇవ్వలేదని.. సర్జరీ చేస్తుంటే చాలా ఏడ్చినట్లు బాధితులు చెబుతున్నారన్నారు. ఆపరేషన్ పూర్తయ్యాక ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నామంటూ కన్నీటి పర్యంతం అయ్యారని బండి సంజయ్ తెలిపారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించడానికి రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఏం ఉద్దరించడానికి బిహార్ వెళ్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి పైసలు తీసుకుపోయి బిహార్‌లో పెడతరా? అని ప్రశ్నించారు. 24 గంటలూ ఎవరి కొంపలు ముంచాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేయడమే తప్ప.. పేదల గురించి ఆలోచనే లేని దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు.

తూతూ మంత్రంగా కమిటీ వేశారు..

హరీష్ రావు అబద్దాల మంత్రి అని.. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే వస్తాయంటూ విమర్శించారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతల పనంతా నిత్యం లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, శ్యాండ్ దందాలేనని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే... ఏదో ఒక కమిటీ వేసి తూతూ మంత్రపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప చేసిందేముందని బండి సంజయ్ ప్రశ్నించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని.. పిల్లలకు విద్యకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.  

సీఎం కేసీఆర్ పేదలను పరామర్శించరు..!

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు బండి సంజయ్. రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు. పేదల ప్రాణాల కంటే కేసీఆర్ సర్కార్ కు పేరు ప్రఖ్యాతలే ముఖ్యం అంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ కు పేదల ఉసురు కచ్చితంగా కొడుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఒప్పుకోమన్నారు. ఎనిమిదేళ్ళ కాలంలో ఒక్క పేద కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించలేదన్నారు. సీఎం కేసీఆర్ మనిషి కాదంటూ దెప్పిపొడిచారు. బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలు చెబుతున్నట్లు ఆయన వివరిచారు. ఈ ఘటనకు బాధ్యుడైన వైద్యశాఖ మంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలన్నారు. హరీష్ రావు కుటుంబ సభ్యుడు కాబట్టే ఆయనపై సీఎం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇంత జరుగుతున్నా బాధితులను పరామర్శించేందుకు ఎందుకు రాలేదో సీఎం సమాధానం చెప్పాలన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol mess: పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Fuel Shortage in Telangana: తెలంగాణలో పెట్రోల్, LPG కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు: పౌరసరఫరాల శాఖ
తెలంగాణలో పెట్రోల్, LPG కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు: పౌరసరఫరాల శాఖ

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget