Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్కు స్వల్ప ఊరట
Sandhya Theatre Case : సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోమవారం వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Allu Arjun Appeared Virtually In Sandhya Theatre Incident Case : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ11గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. మూవీ షూటింగ్ కారణంగా ముంబయిలో ఉండడంతో ఆన్లైన్లో విచారణకు హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. గత విచారణలోనూ బన్నీ వర్చువల్గానే హాజరయ్యారు. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్లయింది.
నిందితులుగా చేర్చిన వారిలో కొంతమంది వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అందరూ హాజరైతేనే తదుపరి విచారణ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేస్తూ ఈ నెల 29కి వాయిదా వేసింది. పోలీసులు ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేర్చారు. వీరిపై 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు.
Also Read : Satluj OTT : రెండు రోజులకే ఓటీటీలో డిలీట్ - 'సట్లెజ్' మూవీ కాంట్రవర్సీ ఏంటి?... మళ్లీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలేం జరిగిందంటే?
2024, డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా... ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బన్నీని చూసేందుకు ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీనికి థియేటర్ యాజమాన్యంతో పాటు బన్నీని కూడా బాధ్యున్ని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత బాధిత కుటుంబానికి అల్లు అర్జున్, అల్లు అరవింద్ సహా మూవీ టీం అండగా నిలిచింది. బాలుడి వైద్యానికి ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ పూర్తిగా కోలుకున్నాడు.
Also Read : Razor OTT : రెండు ఓటీటీల్లో రవిబాబు వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
ట్రెండింగ్ వార్తలు























