అన్వేషించండి

AEE Nikhesh Kumar: ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలుకు తరలింపు

Acb Raids | నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్‌ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం నిఖేష్ కుమార్‌ను చంచలగూడ జైలుకు తరలించారు.

14 days Remand for AEE Nikhesh Kumar and shifted to chanchalguda jail | హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏఈఈ నిఖేశ్‌ కుమార్ ను శనివారం రాత్రి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఉదయం న్యాయమూర్తి నివాసంలో నిఖేష్ ను హాజరు పరిచారు. నిఖేష్‌కు జడ్జి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఏసీబీ అధికారులు నిఖేష్ కుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరో అవినీతి అధికారిపై ఏసీబీ దాడులు

తెలంగాణలో భారీ అవినీతి తిమింగళం అధికారులకు చిక్కింది. ఏసీబీ చరిత్రలోనే రెండో అతి పెద్ద ఆపరేషన్ అని అధికారులు భావిస్తున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటూ ఏవీ అతడికి కనిపించవని.. అన్నింటికి పర్మిషన్స్ ఇస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్‌ కుమార్ కోట్లు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిఖేష్ కుమార్ ఇళ్లు, ఆస్తులతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. ఖరీదైన విల్లాలు, విలువైన భూములు, బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు. మార్కెట్ వాల్యూ ప్రకారం నిఖేష్ ఆస్తి 600కోట్లు ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. 

నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు నార్సింగి లో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనంతో పాటు మైరాన్ విల్లా, వాసవి అట్లాంటిస్ నానక్ రామ్ గూడ, బ్లిస్ శంషాబాద్, సాస్ గచ్చిబౌలి, కపిల్ ఇన్ఫ్రా, రాయిచాందినీలో ఖరీదైన విల్లాలు ఉన్నట్లు ఏసీబీ సోదాలలో అధికారులు గుర్తించారు. మొయినాబాద్ లో మూడు ఫామ్ హౌస్ లు, తాండూర్లో మూడెకరాల వ్యవసాయ స్థలంతో పాటు బంధువుల నివాసాల్లో కిలోకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

Also Read: Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం

శనివారం ఓ టీమ్ హైదరాబాద్ లోని నిఖేష్ కుమార్, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అదే మయంలో మరో టీమ్ మొయినాబాద్ లోని తోల్‌కట్ట, సజ్జన్‌పల్లి, నక్కలపల్లిలోని ఫాంహౌస్‌లతోపాటు బంధువులకు చెందిన 19 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బహిరంగ మార్కెట్‌లో ఆ అక్రమాస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

లాకర్లపై ఏసీబీ అధికారులు ఫోకస్

నికేష్ కుమార్ బంధువులు, బినామీలకు చెందిన లాకర్లను ఏపీ అధికారులు రేపు తెరవనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఏసీబీ ట్రాప్ అయిన సిసిఎస్ మాజీ ఏసిపి ఉమా మహేశ్వర రావుతో కలిసి ఏఈఈ నిఖేష్ కుమార్ సెటిల్మెంట్ లు చేశారని ఆరోపణలున్నాయి. గత కొన్ని రోజులుగా నిఖేష్ వ్యవహారంపై ఏసీబీ నిఘాపెట్టింది. శనివారం నాడు కొన్ని టీమ్‌లుగా ఏర్పడి ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు చేసి విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు బంగారాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

Also Read: Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget