అన్వేషించండి

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

YS Sharmila : డిసెంబర్ 4 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని అడిషనల్ డీజీపీని కోరారు.

YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం హైదరాబాద్ లో అడిషనల్ డీజీపీని కలిశారు. తన పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. షర్మిల ఫ్లెక్సీలు, ప్రచార రథానికి నిప్పుపెట్టారు. వాహనాలపై రాళ్లదాడి చేశారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాను తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని అడిషనల్ డీజీపీకి వినతి పత్రం అందించారు. డీజీపీని కలిసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. 

డిసెంబర్ 4న పాదయాత్ర తిరిగి ప్రారంభం 

"ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది పోలీసులే అన్న మచ్చ డిపార్ట్ మెంట్ కు వస్తుందని చెప్పాం. ఇది తగదు మాకు సరైన భద్రత కల్పించాలని కోరాం. డిసెంబర్ 4వ తేదీన పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తాం. పాదయాత్ర ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి మొదలుపెడతాం. ఇప్పటికే 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశాం. టీఆర్ఎస్ గూండాల కోసం పోలీసులు ఎక్కడైతే మా పాదయాత్రను అడ్డుకున్నారో అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తాం. డిసెంబర్ 14న పాదయాత్ర  ముగిస్తాం. దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాం. "- వైఎస్ షర్మిల 

టీఆర్ఎస్ గూండాల దాడులు! 

టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉద్యమకారులున్న పార్టీ, ఇప్పుడు స్వార్థపరులతో నిండిపోయిందని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలుగా మారిపోయారన్నారు. తెలంగాణలో తాలిబాన్ల రాజ్యం కొనసాగుతోంది. 'నల్లిని నలిపినట్లు నలిపేస్తాం, ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టనీయం, మీకు ఏం జరిగినా మా బాధ్యత కాదు' ఇలాంటి మాటలు వింటుంటే ఇది తాలిబాన్ల రాజ్యం అని నిర్థారణ అవుతోందన్నారు. టీఆర్ఎస్ నాయకుల ముసుగులో గూండాలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాలిబన్ల అధ్యక్షుడని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ తాలిబాన్ల మాటలకు మేం బెదరమని షర్మిల అన్నారు. ఇక్కడున్నది రాజశేఖర్ బిడ్డ అన్న షర్మిల... ఎన్ని అవరోధాలు ఎదురైనా పాదయాత్రను కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీని ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉదయించే సూర్యుడు అన్నారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రతిరోజు ఎత్తిచూపుతామన్నారు. ప్రజల పక్షాన పోరాడతామన్నారు. కాంట్రాక్టుల పేరు చెప్పి కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ పేరు చెప్పి దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ఆస్తి సంపాదించిందని షర్మిల ఆరోపించారు. 

దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే 

లోటస్ పాండ్ లో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 4 నుంచి 14 వరకు పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా పాదయాత్ర ఆపేది లేదన్నారు.  వైఎస్సార్టీపీకి ఆదరణ పెరగడంతో టీఆర్ఎస్ భయపడుతుందన్నారు. అందుకే పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేశారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆపలేమని అందుకే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని చూశారన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే రిమాండ్ కు పంపిస్తారా అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందన్నారు. దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే అన్నారు. వైఎస్ఆర్ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు.  

అప్పుల కుప్ప

"కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు నా పోరాటం ఆగదు. నా పాదయాత్రను ఆపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. నేను గవర్నర్ ను కలసి నా పాదయాత్రకు సంబంధించిన విషయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాను. నా ఆస్తులపై విచారణకు సిద్ధం. తెలంగాణ మళ్లీ ఆంధ్రాలో కలవడం సాధ్యమేనా? నేను తెలంగాణ కోడలిని, తెలంగాణ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేసుకున్నాను. కేసీఆర్ బీజేపీతో డ్యూయెట్లు పాడుతున్నారు. లిక్కర్ స్కామ్, ప్రాజెక్ట్ లలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ జరగాలి. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అవినీతి బయటపెట్టాలి."- వైఎస్ షర్మిల 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
Embed widget