అన్వేషించండి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాల సర్పంచ్ లు, ఎంపీటీసీలను మభ్యపెట్టి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంక్షేమం, అభివృద్ధిని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మునుగోడు ప్రజల్ని ఓట్లు అడిగితే  సీఎం కేసీఆర్ ను ప్రజలు హర్షించేవారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఎప్పటిలాగానే సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల సర్పంచ్, ఎంపీటీసీలను కొనుగోలు చేయడం ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మారుస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తు్న్నారని విమర్శించారు. నల్గొండ పోరాటాల గడ్డ అని, ఎందరో పోరాటయోధులు ఈ గడ్డపై పుట్టారని రేవంత్ రెడ్డి గుర్తుచేసారు. ప్రజా సమస్యలపై ధర్మ భిక్షం, మల్లు స్వరాజ్యం, పాల్వాయి గోవర్థన్ పోరాడారన్నారు. కానీ సీఎం కేసీఆర్ కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. 

ప్రలోభాలకు లొంగిపోవద్దు

"మునుగోడు ప్రజలకు ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా... కరోనా రావడం వల్ల నా పర్యటనలో ఆలస్యం అయింది. రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా ఈ నెల 20వ తారీఖు నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటాను. ముఖ్యంగా  కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తు్న్నాను. ఎనిమిది సంవత్సరాలు కొట్లాడిండ్రు, నష్టపోయారు. అధికారంలోకి వచ్చే సమయంలో ఇప్పుడు అధికార పార్టీ బెదిరింపులకో , చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం. కాబట్టి కలిసికట్టుగా నిలబడి మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ఈ విజయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం"- రేవంత్ రెడ్డి 

ఈ నెల 20 నుంచి 

ప్రజల తరఫున ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఉండి కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని శ్రేణులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20 నుంచి తాను మునుగోడులో పర్యటిస్తున్నానన్నారు. శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కలిసికట్టుగా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని రేవంత్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.  

మండలాల వారీగా నాయకుల జాబితా 

మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ గ్రామ స్థాయిలో కార్యాచరణ ప్రారంభించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో వ్యూహ, ప్రచార కమిటీని ఏర్పాటుచేశారు. ఉపఎన్నిక ఇన్‌ఛార్జ్ గా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వ్యవహరిస్తారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు. మండలాల వారీగా నాయకుల జాబితాను ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ తెలిపారు. చౌటుప్పల్‌ మండల బాధ్యతలను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, వరంగల్‌ జిల్లా నాయకుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నారాయణపురం మండల బాధ్యతలు మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌, గండ్ర సత్యనారాయణలకు అప్పగించినట్లు తెలిపారు. మునుగోడు మండల ఇన్‌ఛార్జ్ లుగా ఎమ్మెల్యే సీతక్క, విజయ రమణారావులను నియమించారు. నాంపల్లి మండలానికి మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవిని నియమించారు. గట్టుప్పల్‌ మండలానికి మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ సంపత్‌ కుమార్‌, ఆది శ్రీనివాస్ లకు అప్పగించారు. చండూరు మండలానికి మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌, డాక్టర్‌ వంశీకృష్ణ, మర్రిగూడ మండల బాధ్యతను చెరుకు సుధాకర్‌, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డిలకు కేటాయించారు.  

Also Read : బీజేపీ తీరు వల్లే జనగామలో ఉద్రిక్తత- సామాన్యులపై బండి సంజయ్ గ్యాంగ్ ప్రతాపం: ఎర్రబెల్లి

Also Read : Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget