Minister Niranjan Reddy : కాళేశ్వరం ప్రాజెక్టులో లోపం లేదు, పంప్ హౌస్ లు మునిగిపోతే ప్రభుత్వానిదా తప్పు- మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి లోపం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరదతో పంప్ హౌస్ లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా? అని నిలదీశారు.

Minister Niranjan Reddy : పాలమూరు- రంగారెడ్డి(Palamuru Rangareddy) ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కృష్ణా నదిపై మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఆధారపడి ఉన్నాయని నిరంజన్ రెడ్డి అన్నారు. వరదల వల్ల కాళేశ్వరం(Kaleshwaram) పంప్హౌస్లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఇంజినీర్ అయిన పెంటారెడ్డి(Pentareddy)పై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోలేదా?
నాగార్జునసాగర్ ప్రాజెక్టును నెహ్రూ కట్టారంటారు. శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project)ను నీలం సంజీవరెడ్డి కట్టారంటారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వైఎస్ఆర్(YSR) కట్టారంటారు. కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్(KCR) గురించి మాత్రం మాట్లాడరు. నీటి లభ్యత ఉన్న చోటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ మహాద్భుతం అని ప్రపంచం కీర్తిస్తోంది. 28 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా కాళేశ్వరం నిర్మించారు. సాంకేతికంగా ఏ లోపం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. వరదతో పంప్హౌస్లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా? 1998, 2009 లో శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోలేదా? నీటిరంగ నిపుణుడు పెంటారెడ్డిని అవమానిస్తారా? కాంగ్రెస్(Congress) హయాంలో పెంటారెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టులు కట్టలేదా? - నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి లోపం లేదు
ప్రాజెక్టులు నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లో కట్టాలంటున్నారని, కానీ జూరాల ప్రాజెక్టు(Jurala Project)ను నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లోనే కట్టారా అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. నీటిలభ్యత ఉన్న దగ్గర పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కడుతుంటే ఆటంకాలు కలిగించడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇప్పటికే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ ప్రాజెక్టుపై 180 కేసులు వేశారని ఆరోపించారు. ఎవరెంత అడ్డుకున్నా ఏడాదిన్నరలోపు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎటువంటి లోపంలేదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గోదావరి వరదలు(Godavari Floods) మానవ తప్పిదం కాదని, ప్రకృతి విపత్తు అని మంత్రి చెప్పారు. విపక్షపార్టీలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టడానికి 30 ఏళ్లు పట్టిందని విమర్శించారు. తాము మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















