అన్వేషించండి

Komatireddy Rajagopal: కేసీఆర్ ఉచ్చులో అస్సలు పడను, అమిత్ షాను కలిశా - ఎమ్మెల్యే కోమటిరెడ్డి, పార్టీమార్పుపైనా వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy: మునుగోడు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ తరహాలో ప్రలోభాలు పెట్టినట్లుగా ఇక్కడ కుదరదని అన్నారు.

ఎన్నికల్లో గెలిచేందుకు నీచాతినీచమైన విధానాలను సీఎం కేసీఆర్ అనుసరిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే సీఎం కేసీఆర్ అన్ని రకాల హామీలు వస్తాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని తాను కోరుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామాగా కొట్టిపారేశారు. మునుగోడు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటే, వారు చెప్తే తాను రాజీనామా చేస్తానని, అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని అన్నారు. వారికి ఏది మేలు జరుగుతుందో ఆ పని కోసం తన సీటును కూడా త్యాగం చేస్తానని అన్నారు. కానీ, కేసీఆర్ ప్లాన్ ప్రకారం ట్రాప్‌లో పడదల్చుకోలేదని అన్నారు. 

‘‘ఇదంతా కేసీఆర్‌ ఆడుతున్న నాటకం. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. నేను బహిరంగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశాను. అమిత్‌ షాతో రాజకీయాల గురించి మాట్లాడలేదు. నేను అమిత్‌ షాను కలిసినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ అనుకూల పేపర్లలో రాయిస్తున్నారు. రాజీనామా చేస్తున్నానని, ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం చేస్తున్నారు. నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధమే’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

మునుగోడు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ తరహాలో ప్రలోభాలు పెట్టినట్లుగా ఇక్కడ కుదరదని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా తెలివైన వారని అన్నారు. తాను డబ్బు కోసం రంగులు, పదవుల కోసం పార్టీలు మారే రకం కాదని అన్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికే తాను ఓటేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేది బీజేపీ అని తాను మాట్లాడిన మాట నిజమేనని అన్నారు.

తాను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని అన్నారు. తనకు నిలకడ ఉంది కాబట్టే, పార్టీని వదలకుండా ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పుకొచ్చారు. పార్టీపై తనకు విశ్వాసం ఉందని అన్నారు. ‘‘రాజగోపాల్ రెడ్డి మచ్చలేని వ్యక్తి. కొంత మంది డబ్బుల కోసం, పదవుల కోసం పార్టీ మారారు. నేను పార్టీ మారాల్సి వస్తే నా మునుగోడు ప్రజలకు రెండు చేతులతో మొక్కి, వాళ్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. అంతేకానీ, కేసీఆర్ డ్రామాలతో పేపర్లతో అబద్ధాలు రాయించడం వల్ల నేను లొంగను. నేను అమిత్ షాను కలిసిన మాట వాస్తవమే, బహిరంగంగానే కలిశా’’ 

కేసీఆర్‌ను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యం
బీజేపీకి కేంద్రంలో అధికారం ఉంది. వాళ్లు గట్టిగా కొట్లాడితే తెలంగాణలో అధికారంలోకి రావొచ్చు. మోదీ, అమిత్ షా అనుకుంటే కేసీఆర్‌ను బొంద పెట్టొచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది కాబట్టి, బీజేపీతోనే అది సాధ్యం అని నేను చాలా సార్లు చెప్పాను. నా స్వార్థం కోసం నేను అలా చెప్పలేదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశాను. నాకు ఎలాంటి స్వార్థం లేదు. నాజీవిత లక్ష్యమే టీఆర్ఎస్ పార్టీని ఓడించడం, నా జీవితం ఇన్‌ కంప్లీట్ గా ఉండొద్దంటే టీఆర్ఎస్ ఓడాలి. లంగా పనులు చేసి జైలులోకి వెళ్లొచ్చిన వారు మాకు నీతులు చెప్తున్నారు.

మునుగోడులోని మున్సిపాలిటీలకు వచ్చి చూడాలని, కేసీఆర్, కేటీఆర్ ను అసెంబ్లీ సాక్షిగా కోరాను. ఇప్పటిదాకా రాలేదు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు రూ.లక్షల కోట్లు అవినీతిగా సంపాదించుకొని, విదేశాల్లో దాచుకున్న విషయం కూడా త్వరలో బయటికి వస్తుంది. పదవిలో ఉన్న తనపై ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారలేదు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని ముఖ్యమంత్రే కాలు దువ్వుతున్నడు. నా ప్రజల కోసం అసెంబ్లీలో నా గొంతు వినిపించా. హుజూరాబాద్‌లో ప్రలోభాలు పెట్టి ఎలాగైతే విఫలమయ్యాడో గుర్తు చేస్తున్నా.’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget