Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - మెట్రో టైమింగ్స్ పొడిగింపు
Telangana News: పెరిగిన రద్దీ, నగర వాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు హైదరాబాద్ మెట్రో వేళలను అధికారులు పొడిగించారు. ఇక నుంచి రాత్రి 11:45 గంటల వరకూ చివరి రైలు అందుబాటులో ఉండనుంది.

Hyderabad Metro Timings Changed: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) గుడ్ న్యూస్ అందించింది. మెట్రో రైలు టైమింగ్స్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రిపూట ఆలస్యంగా ప్రయాణించే వారికి వెసులుబాటు కలగనుంది. ఇప్పటివరకూ రాత్రి 11 గంటల వరకే చివరి రైలు ఉండగా.. ఇక నుంచి రాత్రి 11:45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే, ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో ఎప్పటిలాగానే ఉదయం 6 గంటలకే రైళ్లు ప్రారంభం కానున్నాయి. కాగా, సోమవారం సగటున రోజుకు 4.50 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. పొడిగించిన టైమింగ్స్ శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. ఇటీవల పెరిగిన రద్దీ దృష్ట్యా.. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టైమింగ్స్ పొడిగించినట్లు తెలుస్తోంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















