అన్వేషించండి

Hyderabad: పాత బస్తీ మెట్రో పనుల్లో వేగం, ముమ్మరంగా డ్రోన్ సర్వే

Hyderabad: పాతబస్తీ మెట్రో పనులను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వేగవంతం చేసింది. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం ఆదివారం ఈ సర్వే చేపట్టింది.

Hyderabad: పాతబస్తీ మెట్రో పనులను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వేగవంతం చేసింది. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ఆదివారం డ్రోన్‌ సర్వే చేపట్టింది. 5.5 కిలోమీటర్ల మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం ఈ సర్వే చేపట్టింది. మసీదులు, ఆలయాలు, తదితర కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పిల్లర్స్‌ నిర్మించేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అధికారులు డ్రోన్‌ సర్వేను ప్రారంభించారు. డ్రోన్‌ నుంచి సేకరించిన హై రెజల్యూషన్‌ చిత్రాలు, రియల్‌ టైమ్‌ డేటా, 3డీ మోడలింగ్, జియోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ద్వారా ఆయా కట్టడాల కొలతలను అంచనా వేయనున్నారు. 

ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌  ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. దారుల్‌ఫా జంక్షన్‌ నుంచి షాలిబండ జంక్షన్‌ వరకు ఉన్న 103 కట్టడాలు ఉన్నాయని, వాటి పరిరక్షణ కోసం ఈ డ్రోన్‌ సర్వే చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు చెప్పారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు  రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేయనున్నారురు. స్టేషన్‌ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. కర్వేచర్‌ సర్దుబాటు, వయాడక్ట్‌ డిజైన్,ఎత్తులు, మెట్రో పిల్లర్‌ లొకేషన్‌లలో తగిన మార్పులు,  ఇంజనీరింగ్‌ పరిష్కారాల కోసం  డ్రోన్‌  సర్వే ద్వారా సేకరించిన డేటా ఉపయోగపడనుంది. 

ఐదు కిలోమీటర్లు, ఐదు స్టేషన్లు  
ఎంజీబీఎస్ నుంచి పురానీ హవేలీ, ఇత్తెబార్‌ చౌక్, అలీజాకోట్ల, మీర్‌ మోమిన్‌ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ ఉంటుంది. ఈ మెట్రో రైల్‌ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్‌ తర్వాత సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్‌లు ఉంటాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ స్టేషన్‌లకు మధ్య 500 మీటర్లే దూరం. నగరంలో ఆయా స్థలాలకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.  

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీ మెట్రో మార్గంలో త్వరలో  భూసామర్ధ్య పరీక్షలు  ప్రారంభించనున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా నుంచి ఈ  పరీక్షలను  ప్రారంభించనున్నారు.  ఈ మార్గం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు లేకుండా జేబీఎస్‌ నుంచి నేరుగా ఫలక్‌నుమాకు ప్రయాణించవచ్చు. వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. చార్మినార్‌ను మెట్రో రైల్‌లో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్‌జంగ్‌ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్‌ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు. 

నిజానికి జేబీఎస్‌ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు 2012లోనే  మెట్రో రైల్‌  ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. కానీ పాతబస్తీలోని వివిధ  ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్‌ వరకు పరిమితం చేశారు. కొద్ది రోజుల తరువాత సీఎం కేసీఆర్‌ పాతబస్తీ మెట్రోకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకోసం 500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఈ మార్గంలో సర్వే పనులను ప్రారంభించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget