అన్వేషించండి

Bhainsa RSS Rally : భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశం

Bhainsa RSS Rally : భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మార్చ్ నిర్వహించుకోవచ్చని తెలిపింది.

Bhainsa RSS Rally : నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. 500 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనాలన్న హైకోర్టు.. మసీదుకు 300 మీటర్లు దూరంలో ర్యాలీ నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేనివారే ర్యాలీలో పాల్గొనాలని కోర్టు సూచించింది. మసీదు దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ర్యాలీలో పాల్గొనే వారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొంది. 

ఒక్క స్లోగన్ తో మతవిద్వేషాలు

అయితే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి భైంసా పోలీసులు అనుమతి నిరాకరించారు.  మార్చి 5న భైంసాలో ఆర్ఎస్ఎస్ తలపెట్టిన భారీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటెలిజెన్స్ నివేదికను ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు. రెండు సంవత్సరాలు క్రితం భైంసాలో జరిగిన మత ఘర్షణలు వలన ప్రాణ నష్టం జరిగిందని కోర్టుకు తెలిపారు. భైంసా అత్యంత సున్నిత, సమస్యాత్మకమైన ప్రాంతమని ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదించారు. ఒక్క స్లోగన్ తో మత విద్వేషాలు చెలరేగుతాయన్నారు.  టిప్పు సుల్తాన్ బర్త్ డే ర్యాలీకు సైతం పోలీసులు అనుమతి ఇచ్చారని, ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. భైంసా భారత దేశంలోనే ఉందని, బహిష్కరించిన ప్రాంతం కాదని పిటిషనర్ తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇచ్చింది. 

ఆర్ఎస్ఎస్ ర్యాలీ 

ఫిబ్రవరి 19న భైంసాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 'పాద సంచలన్' (మార్చ్), 'షరీరిఖ్ ప్రదర్శన్'కు గతంలో హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే పట్టణ స్థాయిలో ‘శరీరిక్ ఉత్సవం’ ద్వైవార్షిక సాధన అని ఆర్‌ఎస్‌ఎస్ కోర్టును విజ్ఞప్తి చేసింది. సభ్యులు యూనిఫారాలు ధరించి, వీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తారని, భౌతిక ప్రదర్శనలు, ప్రసంగాలు చేస్తారని తెలిపింది. 2011లో జనాభా లెక్కల ప్రకారం భైంసాలో 49,764 మంది నివసిస్తున్నారు. వీరిలో హిందువులు 49.06 శాతం ఉండగా, ముస్లింలు 46.94 శాతం ఉన్నారు.

భైంసా సున్నిత ప్రాంతం

నిర్మల్ జిల్లాలోని భైంసాలో 2021 మార్చి 7వ తేదీన అల్లర్లు చెలరేగాయి. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్లదాడి చేశారు. చిన్నగా మొదలైన గొడవ అల్లర్లకు దారితీసింది. పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే.. కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో ఉద్రిక్తత మరింతగా పెరిగింది. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణల్లో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, పోలీసులు కూడా ఉన్నారు.  భైంసా అల్లర్లలో తోటా మహేష్‌, దత్తు పటేల్ బైక్‌పై వెళ్తూ స్నేహితుడి నెత్తిపై కొట్టారని పోలీసులు చెప్పారు. ఆ ఘటనతో భైంసాలో అల్లర్లు మొదలయ్యాయని అప్పట్లో పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, సాక్ష్యాల ఆధారంగా అప్పట్లో 38 మందిని అరెస్ట్ చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
Chandrababu: ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
Embed widget