అన్వేషించండి

CLP Meeting: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, సీఎల్పీ భేటీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CLP Meeting: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్ణాటకతో సహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

CLP Meeting: హైదరాబాద్  తాజ్ దక్కన్ హోటల్ లో సీఎల్పీ సమావేశం(CLP Meeting) జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,  ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, వీరయ్య, జగ్గారెడ్డి, సీతక్క, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, చిన్నారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. 

సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం : ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  

బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్(Congress) అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(MP Uttam Kumar Reddy) అన్నారు. గవర్నర్ ప్రసంగం(Governor Speech) రద్దు చేయడం సరైన విధానం కాదన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) అహంకారానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో, పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రస్తావిస్తుందన్నారు. దళిత బంధు(Dalita Bandhu) సక్రమంగా అమలు చేయాలని ఉత్తర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నా కేసీఆర్ ఇప్పటికైనా బడ్జెట్ లో కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు(Early Elections) వస్తాయని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్ణాటకతో పాటు తెలంగాణ(Telangana)లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. నేతలందరూ నియోజకవర్గాలకు వెళ్లాలన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయ్యాలో సోనియా గాంధీ నిర్ణయిస్తారన్నారు. 

'రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయాలి. రేషన్ ద్వారా సన్న బియ్యం అందజేయాలి. కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర, పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడం 'లేదు. ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ అక్రమాలు పెరిగిపోయాయి. వీటిపై సభలో నిలదీస్తాం.' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : భట్టి విక్రమార్క 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నించాల్సిన ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశాం. ప్రజా సమస్యలు విస్తృతంగా చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం తూ.తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని ప్రయత్నిస్తోంది. గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సభ పొరోగ్ జరగలేదని చెప్పడం సంప్రదాయానికి పూర్తి విరుద్ధం. ఇన్ని రోజులు పొరోగ్ చేయలేదంటేనే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. గవర్నర్ ప్రసంగం లేకపోవడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే. గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం ఉండేది. అది మేము కోల్పోయామని భట్టి విక్రమార్క అన్నారు. 

ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయ్ కాట్ 

ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jaggareddy) సీఎల్పీ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. తనకు గతంలోనూ, ఇప్పుడు అనేక చేదు అనుభవ అన్యాయాలు జరిగాయని ఎమ్మెల్యే అన్నారు. అందుకు నిరసనగా సీఎల్పీ భేటీని బహిష్కరించానని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget