అన్వేషించండి

CM KCR On Paddy Procurement : రైతులకు గుడ్ న్యూస్, యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR On Paddy Procurement : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

CM KCR On Paddy Procurement : తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.  ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు(సోమవారం) ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటిని ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు 

సీఎస్ కలెక్టర్లతో మీటింగ్ 

యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సీజన్‌లో 7 వేల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. కొనుగోళ్ల విషయంలో సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సీఎస్ అధికారులకు ధాన్యం కొనుగోళ్లను తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేయనున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోకుండా మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఏటా దాదాపు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తుంది. ఈ ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లోనే నేరుగా జమచేస్తున్నారు. ఈ ఏడాది గ్రేడ్‌ వన్‌కు రూ.2060, సాధారణ వరి రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం నిర్ణయించింది.  

ఇటీవలె మంత్రి గంగుల సమీక్ష  

కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి సీజన్‌ మాదిరి ఈ యాసంగిలో కూడా ధాన్యం సేకరిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలను గుర్తించేందుకు అన్నీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులు "ఎఫ్‌ఏక్యూ" నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ అధికారులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ప్రతి ఏటా యాసంగి వరి ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 672 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి గంగుల తెలిపారు. కరోనా సంక్షోభంలో కూడా 92 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా, అలసత్వం ప్రదర్శించినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

టాప్ హెడ్ లైన్స్

New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
CM Revanth Reddy Gumpu Mestri Speech: అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget