అన్వేషించండి

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 Kishan Reddy : హైదరాబాద్ లో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. అడ్డగుట్ట, తుకారంగేట్, తార్నాక, లాలాపేట ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. తాగునీరు, డ్రైనేజి సమస్యల గురించి కాలనీల వాసులను అడిగితెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం కిషన్ రెడ్డి బోరబండ, ఎర్రగడ్డలలో పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.

రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు 

సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా సికింద్రాబాద్  అడ్డగుట్ట డివిజన్ లో పలు బస్తీలలో అధికారులతో కలిసి తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రెండు పడక గదుల ఇల్లు ఇంకా రాలేదని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన  విషయాన్ని పరిష్కరించాలని తనతో పాటు వచ్చిన అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. అధికారులతో కలిసి ప్రజా సమస్యలను పూర్తిగా తెలుసుకున్న అనంతరం వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే ఆదాయంలో 10 శాతం అయినా నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. సికింద్రాబాద్‌లోని పలు బస్తీలలో పర్యటించిన ఆయన.. నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకున్న కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

10 శాతం ఆదాయం ఇక్కడే ఖర్చు చేయాలి

"నాకు ఎప్పుడు సమయం దొరికినా సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సమస్యలను ప్రజలు తెలియజేశారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలను అధికారులకు అందిస్తు్న్నాను. జీహెచ్ఎంసీ, సీఎస్ కు ఈ సమస్యలను తెలియజేస్తాను. తెలంగాణకు మొత్తం రెవెన్యూలో 80 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. నిధుల కొరత కారణంగా జీహెచ్ఎంసీలో పనులు పెండింగ్ పడుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు ధర్నాలు కూడా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిది ఒక్కటే ఒక 10 శాతం ఆదాయాన్ని అయినా స్థానికంగా ఖర్చుపెట్టాలని కోరుతున్నాను. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను." - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Breaking News: కోన‌సీమ‌లో తీవ్ర విషాదం.. స‌ముద్రంలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు
కోన‌సీమ‌లో తీవ్ర విషాదం.. స‌ముద్రంలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు
CM Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, ఎవరికీ అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget