అన్వేషించండి

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 Kishan Reddy : హైదరాబాద్ లో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. అడ్డగుట్ట, తుకారంగేట్, తార్నాక, లాలాపేట ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. తాగునీరు, డ్రైనేజి సమస్యల గురించి కాలనీల వాసులను అడిగితెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం కిషన్ రెడ్డి బోరబండ, ఎర్రగడ్డలలో పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.

రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు 

సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా సికింద్రాబాద్  అడ్డగుట్ట డివిజన్ లో పలు బస్తీలలో అధికారులతో కలిసి తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రెండు పడక గదుల ఇల్లు ఇంకా రాలేదని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన  విషయాన్ని పరిష్కరించాలని తనతో పాటు వచ్చిన అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. అధికారులతో కలిసి ప్రజా సమస్యలను పూర్తిగా తెలుసుకున్న అనంతరం వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే ఆదాయంలో 10 శాతం అయినా నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. సికింద్రాబాద్‌లోని పలు బస్తీలలో పర్యటించిన ఆయన.. నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకున్న కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

10 శాతం ఆదాయం ఇక్కడే ఖర్చు చేయాలి

"నాకు ఎప్పుడు సమయం దొరికినా సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సమస్యలను ప్రజలు తెలియజేశారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలను అధికారులకు అందిస్తు్న్నాను. జీహెచ్ఎంసీ, సీఎస్ కు ఈ సమస్యలను తెలియజేస్తాను. తెలంగాణకు మొత్తం రెవెన్యూలో 80 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. నిధుల కొరత కారణంగా జీహెచ్ఎంసీలో పనులు పెండింగ్ పడుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు ధర్నాలు కూడా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిది ఒక్కటే ఒక 10 శాతం ఆదాయాన్ని అయినా స్థానికంగా ఖర్చుపెట్టాలని కోరుతున్నాను. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను." - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget