అన్వేషించండి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : సీఎం కేసీఆర్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

Kishan Reddy : తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు చేశారు. సీఎం  కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలను కలిసే సమయం కూడా లేదని ఎద్దేవా చేశారు.  ప్రజలను అన్ని విషయాల్లో టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని ఆక్షేపించారు. ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కేసీఆర్‌బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

వైఫల్యాలు కప్పిపుచ్చుకొనేందుకు ఆరోపణలు 

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకిలా మోత అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఫీజు రీయాంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, వ్యవసాయానికి ఇవ్వాల్సిన సబ్సిడీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన సాల్కర్‌ షిప్ లు సవ్యంగా అమలుచేయడంలేదని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధుల వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.  ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చిన్న చెల్లింపులు కూడా సకాలంలో జరపడం లేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీల నిధులపై చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.  

గెలిపిస్తే గాలికొదిలేశారు

రెండు సార్లు టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే ఇచ్చిన హామీలు గాలికొదిలేదని మోసం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊహల్లో విహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్పు చేయకుంటే జీతాలివ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. భూములు అమ్ముకోకపోతే పూటగడవని పరిస్థితి ఉందన్నారు.  లోపాలు చెబితే పక్షపాతం అంటారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గవర్నర్ అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదని మండిపడ్డారు.  

ప్రభుత్వ భూముల విక్రయం 

అప్పులు కావాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ లో మార్పుల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్యాయం జరిగిందని రైతులు దరఖాస్తు చేసుకుంటే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గురుకులాలు, హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై ధర్నాలు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

Also Read : YS Sharmila: ఆయన మోసగాడు, రంగులు మార్చడంలో దిట్ట - షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Aslo Read : Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget