అన్వేషించండి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : సీఎం కేసీఆర్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

Kishan Reddy : తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు చేశారు. సీఎం  కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలను కలిసే సమయం కూడా లేదని ఎద్దేవా చేశారు.  ప్రజలను అన్ని విషయాల్లో టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని ఆక్షేపించారు. ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కేసీఆర్‌బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

వైఫల్యాలు కప్పిపుచ్చుకొనేందుకు ఆరోపణలు 

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకిలా మోత అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఫీజు రీయాంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, వ్యవసాయానికి ఇవ్వాల్సిన సబ్సిడీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన సాల్కర్‌ షిప్ లు సవ్యంగా అమలుచేయడంలేదని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధుల వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.  ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చిన్న చెల్లింపులు కూడా సకాలంలో జరపడం లేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీల నిధులపై చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.  

గెలిపిస్తే గాలికొదిలేశారు

రెండు సార్లు టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే ఇచ్చిన హామీలు గాలికొదిలేదని మోసం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊహల్లో విహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్పు చేయకుంటే జీతాలివ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. భూములు అమ్ముకోకపోతే పూటగడవని పరిస్థితి ఉందన్నారు.  లోపాలు చెబితే పక్షపాతం అంటారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గవర్నర్ అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదని మండిపడ్డారు.  

ప్రభుత్వ భూముల విక్రయం 

అప్పులు కావాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ లో మార్పుల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్యాయం జరిగిందని రైతులు దరఖాస్తు చేసుకుంటే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గురుకులాలు, హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై ధర్నాలు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

Also Read : YS Sharmila: ఆయన మోసగాడు, రంగులు మార్చడంలో దిట్ట - షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Aslo Read : Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget