అన్వేషించండి

YS Sharmila: ఆయన మోసగాడు, రంగులు మార్చడంలో దిట్ట - షర్మిల ఘాటు వ్యాఖ్యలు

కేసీఆర్ 8 ఏళ్లుగా అంతా గారడీ మాటలే చెబుతున్నారని, ఉద్యోగాలు లేక వందల మంది బిడ్డలు చనిపోతే రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని షర్మిల విమర్శించారు.

వివిధ రకాల పథకాల పేరు చెప్పి సీఎం కేసీఅర్ చేసింది మోసమేనని, ఎవరు ప్రశ్నించకూడదని, ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా చేస్తున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. కేసీఆర్ మోసగాడని, ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో దిట్ట అని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్ర వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు చేరింది. సదాశివపేట పట్టణంలో ప్రజలతో మాట్లాడిన ఆమె ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సంక్షేమ పాలన తమ పార్టీతోనే సాధ్యం అవుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలను కేసీఆర్‌తోపాటు కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మోసం చేశాయని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

కేసీఆర్ 8 ఏళ్లుగా అంతా గారడీ మాటలే చెబుతున్నారని, ఉద్యోగాలు లేక వందల మంది బిడ్డలు చనిపోతే రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని షర్మిల విమర్శించారు. కేసీఅర్ అవినీతిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడు ప్రశ్నించలేదని అన్నారు. వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని, వైఎస్సార్ సంక్షేమ పాలన కావాలని కోరుకుంటున్న ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలని షర్మిల పిలుపునిచ్చారు.

‘‘ప్రజాప్రస్థానం పాదయాత్రలో మీ సమస్యలు చెప్పుకుంటూ.. YSR సంక్షేమ పాలనకు మద్దతు తెలుపుతూ ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం, సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలాల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ తీరుస్తా. మీ కష్టాలు తొలగిస్తా. వైయస్ఆర్ గారు రూ.35వేల కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తే.. కేసీఆర్ గారు రీడిజైన్ పేరుతో రూ.55 వేల కోట్లకు పెంచారు. రూ.17వేల కోట్ల పనులు చేపట్టామని చెప్పి, భారీగా కమీషన్లు మింగి, ప్రాజెక్టును అటకెక్కించారు.’’ అని వైఎస్ షర్మిల అన్నారు.

ఏపీ విషయంలోనూ ఇటీవల హాట్ కామెంట్స్
ఇటీవలే సీఎం జగన్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తొలగించి, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పేరు పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన అంశంపై కూడా వైఎస్ షర్మిల మరో సందర్భంలో స్పందించారు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ..  వైఎస్ కుమార్తె, జగన్ సోదరి మాత్రం ఖండించారు. అ నిర్ణయం కరెక్ట్ కాదని అన్నారు. 

ఒకరి ఖ్యాతి వైఎస్ఆర్‌కు అవసరం లేదు: షర్మిల
ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనని షర్మిల స్పష్టం చేశారు. ఓ కుమార్తెగా తనను తండ్రి ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని, ఈ ప్రపంచంలో తాను తన తండ్రిని ఆరాదించినట్లుగా ఎవరినీ ఆరాధించలేదని అన్నారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేనన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు...రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించినట్లే కదా అని ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ కు ఆ ఖ్యాతిని ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. YSR చనిపోతే ఆ భాద తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారని అన్నారు.

జగన్ నిర్ణయాన్ని షర్మిల వ్యతిరేకించడంపై చర్చ 
పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన తర్వాత రోజు ఓ మీడియాతో మాట్లాడుతూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆరే పేరు పెట్టడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో తాను ఈ అంశంపై తనను తాను ప్రశ్నించుకున్నానని..  అర్హుల పేరే వైద్య విశ్వవిద్యాలయానికి ఉండాలని, అందుకే పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇప్పుడు షర్మిల జగన్ నిర్ణయానికి భిన్నంగా ప్రకటన చేయడం వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 

షర్మిల వ్యాఖ్యలపై స్పందించని వైఎస్ఆర్‌సీపీ నేతలు
కొంత కాలంగా జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు మధ్య సత్సంబంధాలు లేవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో షర్మిల జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించడం అది కూడా తన తండ్రి విషయంలో కావడంతో మరింతగా వైరల్ అవుతోంది. షర్మిల ప్రకటనపై వైఎస్ఆర్‌ సీపీ నేతలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Breaking News: NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget